ముసుగులో కోర్టుకి వచ్చిన బండ్ల గణేష్

మరిన్ని వార్తలు

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈరోజు అంధ్రప్రదేశ్ లోని ప్రొద్దుటూర్ రెండో అదనపు సెషన్స్ కోర్టు ముందుకి హాజరయ్యాడు.

వివరాల్లోకి వెళితే, బండ్ల గణేష్ పైన సుమారు 68 చెక్ బౌన్స్ కేసుల్లో ఆరోపణలు ఎదురుకుంటున్న ఆయన ఈరోజు ఉదయం ప్రొద్దుటూర్ రెండో అదనపు సెషన్స్ కోర్టుకి రావడం జరిగింది. అయితే కోర్టు నుండి బయటకి వచ్చే సమయంలో ఆయన ముఖం కనపడకుండా మాస్క్ వేసుకోవడం చర్చనీయంశంగా మారింది.

ఇక కోర్టు లో ఆయన సదరు చెక్కు బౌన్స్ కేసులలో తనకింకా సమయం కావాలని అడిగినట్టుగా తెలిసింది. దీనితో కేసుల విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసినట్టు సమాచారం.

గతంలో కూడా హీరో,నిర్మాత అయిన సచిన్ జోషి తో ఆర్ధిక లావాదేవీలకి సంబంధించి గణేష్ తో గొడవ జరిగింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS