'కవచం'లో రాణి ఎవరంటే బెల్లకొండ క్లారిటీ ఇచ్చేశాడు.!

మరిన్ని వార్తలు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తాజా చిత్రం 'కవచం' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు ముద్దగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజు లేక ఒంటరిదైన రాణిని, రాజ్యాన్ని కాపాడే ఓ కుర్రోడి కథగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాణిగా నటించే ముద్దుగుమ్మ ఎవరనే అంశంపై ఆశక్తి నెలకొంది. చందమామ కాజల్‌ అగర్వాల్‌, మరో ముద్దుగుమ్మ మెహ్రీన్‌ కౌర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఆ రాణి ఎవరు.? అంటే తాజాగా బెల్లకొండ కారిటీ ఇచ్చేశాడు.

సినిమాలో రాణి 'మెహ్రీనే' అని తేల్చేశాడు. అయితే బెల్లంకొండ మాటల్లో నిజమెంతుంది.? ఆడియన్స్‌ని కన్‌ఫ్యూజ్‌ చేయడానికే బెల్లంకొండ మెహ్రీన్‌ పేరు చెప్పాడా.? లేక నిజంగా రాణి పాత్ర మెహ్రీన్‌దేనా.? అని తెలుసుకోవాలంటే 'కవచం' సినిమా చూడాల్సిందే. ఇకపోతే సినిమాకి మెహ్రీనే మెయిన్‌ అట్రాక్షన్‌ అట. ఆమె పాత్రలో వేరియేషన్స్‌ ఆకట్టుకునేలా ఉంటాయట. హీరోయిన్స్‌ ఇద్దరితోనూ బెల్లంకొండకు లవ్‌ ట్రాక్‌ విభిన్నంగా తీర్చిదిద్దారట. ఖచ్చితంగా ఫ్యాన్స్‌ని మెప్పించే సినిమా అవుతుంది 'కవచం' అని నమ్మకంగా ఉన్నాడు బెల్లంకొండ శ్రీనివాస్‌.

డైరెక్టర్‌ శ్రీనివాస్‌కిది తొలి సినిమానే అయినా, కో డైరెక్టర్‌గా 'దృశ్యం', గోపాలా గోపాలా' తదితర చిత్రాలకు పని చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే ఎంతో కాన్ఫిడెంట్‌గా 'కవచం' అనే యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీని తెరకెక్కించాడు. అయితే ఆయన కాన్ఫిడెన్స్‌కి ఆడియన్స్‌ సపోర్ట్‌ దక్కేనో లేదో మరి కొద్ది గంటల్లోనూ తేలిపోనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS