టాలీవుడ్‌లో బిగ్గెస్ట్‌ ఈవెంట్‌ ఇదే.

మరిన్ని వార్తలు

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం 'భరత్‌ అనే నేను'. ఈ రోజు ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ హైద్రాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో నటిస్తున్న చిత్రమిది. భారీ బడ్జెట్‌ మూవీగానే పరిగణించాలి. బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. 

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌లో మహేష్‌ - కైరా జంట విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇకపోతే, 'బహిరంగసభ' పేరుతో ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఇంతవరకూ టాలీవుడ్‌లో ఏ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జరగనంత ఘనంగా ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారనీ తెలియవస్తోంది. తెలుగు రాష్ట్రాల నుండే కాదు, పొరుగు రాష్ట్రాల నుండి కూడా అభిమానులు, ప్రముఖులు ఈ ఈవెంట్‌కి భారీగా తరలి రానున్నారట. ముఖ్యంగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మరోపక్క ఎంట్రీ టిక్కెట్లు అంటూ కొందరు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అభిమానులను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిని నమ్మవద్దనీ నిర్వాహకులు హెచ్చరిస్తున్నారు. అభిమానుల కోసం కొన్ని పాస్‌లు అందుబాటులో ఉంచామనీ వారు తెలిపారు. మహేష్‌కి 'శ్రీమంతుడు'తో సక్సెస్‌ ఇచ్చిన కొరటా శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS