ఓటీటీలోనూ ఆ పాట లేదేంద‌య్యా..?!

మరిన్ని వార్తలు

భీమ్లా నాయ‌క్‌లో త‌మ‌న్ అందించిన పాట‌ల‌న్నీ హిట్టే. అందులో ఉన్న ఒకే ఒక్క రొమాంటిక్ సాంగ్‌.. `అంత ఇష్ట‌మేంద‌య్యా`. ప‌వ‌న్ - విద్యాబాల‌న్‌ల‌పై తెర‌కెక్కించిన ఈ పాట‌ని చిత్ర పాడారు. ఆడియో ప‌రంగా ఈ పాట సూప‌ర్ హిట్‌. కానీ.. సినిమాలో మాత్రం లేదు. దాంతో ఫ్యాన్స్ షాక‌య్యారు.

 

నిడివిని దృష్టిలో ఉంచుకుని ఆ పాటని క‌త్తిరించిన‌ట్టు చిత్ర‌బృందం చెప్పింది. అయితే.. ఇప్పుడు `భీమ్లా నాయ‌క్‌` ఓటీటీలోకి వ‌చ్చింది. ఓటీటీలోనూ ఆ పాట లేక‌పోవ‌డం మ‌రింత ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఎందుకంటే... ఓటీటీలో నిడివి స‌మ‌స్య ఉండ‌దు. టెంపోలో ఈ పాట లేద‌నుకున్నా, పాసైపోతుంది. కానీ పాట‌ని పెట్ట‌లేదు.

 

ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో త్రివిక్ర‌మ్‌కీ, నిత్య‌కీ ప‌డలేద‌ని, ఆమెపై కోపంతోనే ఈపాట‌ని సినిమాలోంచి తీసేశార‌ని ఓ రూమ‌ర్ వినిపించింది. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం చూస్తే, ఆ రూమ‌రే క‌రెక్ట‌నిపిస్తోంది. ఎందుకంటే అంత ఖ‌ర్చు పెట్టి తీసిన అంత మంచి పాట‌ని సినిమాతోపాటు ఓటీటీలోనూ లేకుండా చేశారంటే.. బ‌ల‌మైన కార‌ణం ఉండే ఉంటుంది. థియేట‌ర్లో చూడ‌క‌పోయినా, ఓటీటీలో ఆ పాట చూసేద్దాం అనుకున్న‌వాళ్ల‌కు మాత్రం త్రివిక్ర‌మ్ అండ్ టీమ్ నిరాశ క‌లిగించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS