ఫోన్లో మేనేజర్ ని బెదిరించిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

మరిన్ని వార్తలు

కాంట్రవర్షియల్ రియాలిటీ షో బిగ్ బాస్ పుణ్యమా అంటూ వివాదాలకు లోటు లేకుండా పోయింది. తాజాగా ఈ షో నిర్వహిస్తున్న ఛానెల్ మేనేజర్ మరో వివాదం లో ఇరుక్కున్నాడు. హౌస్ నుండి బయటకు వెళ్లిన కంటెస్టెంట్ మిగిలిన పారితోషికం ఇవ్వమని ఫోన్ చేసి బెదిరించింది. బిగ్ బాస్ తమిళ్ మూడవ సీజన్ విజయ్ టివి లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ షో లో 'మధుమిత' అనే కంటెస్టెంట్ సూసైడ్ అటెంప్ట్ చేసినందుకు తన ప్రవర్తన చూసి షో నిర్వాహకులు హౌస్ నుండి పంపించేశారు.

 

బిగ్ హౌస్ నుండి బయటకు వెళ్లినా మధుమిత ఇంకా మారలేదు. తనకు రావాల్సిన పారితోషికం మొత్తం రాలేదని అది ఇవ్వకపోతే సూసైడ్ చేస్కుంటాను అని విజయ్ టివి మేనేజర్ ప్రసాద్ ను ఫోన్ చేసి బెదిరించిందట. దాంతో మేనేజర్ ప్రసాద్, ఒప్పందం ప్రకారం తనకు హౌస్ నుండి వెళ్ళేటప్పుడు 11.లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చినా.. ఇంకో 80 వేలు ఇవ్వాలని తనని బెదిరించిందని స్థానిక పోలీస్ స్టేషన్ లో మధుమిత పై కంప్లైంట్ చేసాడట.

 

రెండు వారాల క్రితం స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తన్చినందుకు ఒక కంటెస్టెంట్ ఎలిమినేషన్, గత వారం సూసైడ్ అటెంప్ట్, ఇప్పుడు పోలీస్ కంప్లైంట్.. మొత్తానికి తమిళ్ బిగ్ బాస్ హాట్ హాట్ కాంట్రవర్సీలతో ట్రెండ్ అవుతుంది. ఈ షో పూర్తయ్యేలోపు ఇంకెన్ని కాంట్రవర్సీలు చూడాల్సొస్తుందో మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS