ఈసారి బిగ్ బాస్ షో మరింత గ్లామరెస్ గా ముస్తాబు కానుంది. ఈ కొత్త సీజన్లో సమంత వ్యాఖ్యాతగా కనిపిస్తారని ఓ టాక్ గట్టిగా వినిపిస్తోంది. దీనిపై ఇటు సమంత గానీ, అటు బిగ్ బాస్ నిర్వాహకులు గానీ పెదవి విప్పలేదు. అయితే.. ఇప్పుడు కంటెస్టెంట్లుగా నలుగురు గ్లామర్ భామలు కనిపించనున్నారని మరో వార్త చక్కర్లు కొడుతోంది. యామినీ భాస్కర్, హంసా నందిని, ప్రియా వడ్లమాని, శ్రద్ధాదాస్ ఉన్నారని ఈసారి బిగ్ బాస్ కిరీటం కోసం పోటీ పడబోతున్నారని తెలుస్తోంది.
ఇదే నిజమైతే... బిగ్ బాస్ షో గ్లామర్ హొయలతో మోతెక్కిపోవడం ఖాయం. ఆగస్టు నుంచి కొత్త సీజన్ మొదలు కాబోతోందని, ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో సెట్ పనులు మొదలైపోయాయని, మరో వారం రోజుల్లో కొత్త సెట్ సరికొత్త హంగులతో ముస్తాబు అవుతుందని తెలుస్తోంది. జులైలో బిగ్ బాస్ ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఈసారి షో 50 రోజులకే పరిమితం చేస్తారని ఓ టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.