బిగ్‌బాస్‌: ఈ వారం 'వేటు' ఎవరి పైనా.?

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్‌ మరింత ఆసక్తికరంగా మారింది. నామినేట్‌ అయిన నలుగురు ఇంటి సభ్యుల నుండి ఎవరో ఒకరు ఈ వారం ఖచ్చితంగా బయటికి వెళ్లాల్సి ఉంది. వీరిలో నలుగురు మాత్రమే ఫినాలేకి చేరనున్నారని ఆల్రెడీ బిగ్‌బాస్‌ ప్రకటించారు. రాహుల్‌ ఫినాలే టికెట్‌ని సొంతం చేసుకుని సేఫ్‌ జోన్‌లో ఉన్నాడు. ఇక మిగిలిన బాబా భాస్కర్‌, అలీ రెజా, వరుణ్‌, శివజ్యోతి, శ్రీముఖిలలో ఈ వారం బయటికి వెళ్లేందుకు ఎక్కువ ఎడ్జ్‌ అలీ రెజాకే ఉంది. అయితే, ఒకసారి బయటికి వెళ్లొచ్చిన అలీ రెజా, తన టీమ్‌ని స్ట్రాంగ్‌ చేసుకోవడంతో, అలీ తర్వాత శివజ్యోతికి ఎడ్జ్‌ ఎక్కువ ఉందంటూ ప్రచారం జరుగుతోంది.

 

ఈ వారం శివజ్యోతిని బయటికి పంపించక తప్పదంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇన్ని రోజులూ ఎలాగోలా గట్టెక్కేసిన శివజ్యోతికి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయినట్లే అంటున్నారు. లేటెస్ట్‌ టాస్క్‌లో పచ్చి గుడ్డును పాలలో వేసుకుని తాగే టాస్క్‌ వచ్చింది శివజ్యోతికి. నిజమే పచ్చిగుడ్డు పాలలో మిక్స్‌ చేసుకోవడం అంటే, కష్టమే. కానీ, శివజ్యోతి ముఖంలో కష్టం కన్నా, ఆమె చేసిన ఓవరాక్షనే ఎక్కువగా కనిపించింది.

 

మామూలుగానే కొంచెం ఓవరాక్షన్‌. ఇక ఇలాంటి జుగుప్సాకరమైన టాస్క్‌ని నెరవేర్చే క్రమంలో తన టాలెంట్‌ అంతా ప్రదర్శించేసింది శివజ్యోతి. వీకెండ్‌కి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ మూడు రోజుల్లోనూ ఇంటి సభ్యులు ఇంకెలాంటి విపరీత పరిస్థితుల్ని ఫేస్‌ చేయాల్సి వస్తుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS