నామినేషన్ పర్వం చాలా చెత్తగా సాగుతోంది నాలుగో సీజన్ బిగ్బాస్లో. కంటెస్టెంట్స్ ఎవర్ని ఎందుకు నామినేట్ చేస్తున్నారనేది చూసే జనాలకి అర్థం కావడంలేదు. అంతా డ్రమెటిక్గానే సాగుతోంది. ఈ వారం నామినేషన్ల పర్వం మరీ దారుణంగా తయారైంది. ఒక్క నామినేషన్ కూడా కంటెస్టెంట్స్ మనస్ఫూర్తిగా చేసినట్టు లేదు. బిగ్బాస్ ఆదేశాల మేరకు మాత్రమే ఆయా వ్యక్తులు నామినేట్ అయినట్లుంది. అఖిల్ని సేవ్ చేయడానికి మోనాల్ని నామినేషన్స్లోకి నెట్టేశారు. హారికనీ, లాస్యనీ, మెహబూబ్నీ, అవినాష్నీ.. ఇలాగే నామినేషన్లోకి పంపారు.
సో, ఇక్కడ బిగ్బాస్ ఉద్దేశ్యం సుస్పష్టం. ఎవర్ని కాపాడాలో బిగ్బాస్కి తెలుసు. ఎవర్ని ఇంటికి పంపాలో కూడా బిగ్బాస్కి బాగా తెలుసు అన్నట్లే నడుస్తోంది వ్యవహారం. గత వారం కూడా కుమార్ సాయికి ఎక్కువ ఓట్లు పడినా, అంతకన్నా తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్స్ని సేవ్ చేసి.. కుమార్ సాయిని బయటకు పంపేశారు. ఈ వారం కూడా తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ కాకుండా, ఎవరో ఒకర్ని బలిపశువుని చేయడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.
మరి, ఆ వికెట్ ఎవరిది అవుతుంది.? అవినాష్ని పంపేస్తారా.? లేదంటే, అందరికీ షాకిచ్చేలా అబిజీత్ని ఇంటికి వెళ్ళమంటారా.? లేదు, నామినేషన్ల పర్వమే అర్థం పర్థం లేకుండా సాగింది గనుక, అసలు ఎలిమినేషన్ లేదంటారా.? నోయెల్ సీన్ మెడపై ఎలిమినేషన్ వేటు పడే అవకాశాలు ఎంత.? అన్న ప్రశ్నలకు సమాధానం కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.