ప్రముఖ కమెడియన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు

మరిన్ని వార్తలు

ప్రముఖ తమిళ కమెడియన్ సంతానం పైన తమిళనాడులో పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే, సంతానం కొంతకాలం క్రిందట ఒక కళ్యాణమండపం నిర్మించే పేరిట పెద్దమొత్తంలో డబ్బుని అందచేశాడు. అయితే కొన్ని అనివార్యకారణాల వల్ల ఆ కట్టడం ఆగిపోయింది. దీనితో తన డబ్బుని వెనక్కి ఇవ్వమని షణ్ముగసుందరం అనే వ్యక్తిని కోరాడు.

అయితే ఈ డబ్బు లావాదేవిల వద్ద ఏర్పడిన గొడవ కారణంగా ఇరువురి మధ్య ఘర్షణ జరగడం, ఆ ఘర్షణలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడం వీరంతా గాయపడడం జరిగింది. ఈ గాయపడిన వారిలో స్థానిక బీజీపీ నాయకుడు ఒకరు ఉండడంతో ఈ అంశం తీవ్రంగా మారింది.

 

ఇక సదరు బీజీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఆరోపణల తో సంతానం పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సంతానం ప్రస్తుతం ఎవ్వరికీ అందుబాటులో లేడు అని తెలుస్తున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS