గ్లామర్ తారగా ఎంతో మంది కుర్రోళ్లను తన గాలంలో చిక్కుకునేలా చేసిన ముద్దుగుమ్మ ఛార్మి. పేరులో ఉన్న ఛార్మింగ్ పుష్కలంగా ఆమె మేనిలోనూ దాగుంది.. అనడం అతిశయోక్తి అనిపించదు. అయితేం ఏం లాభం.? ఛార్మి మేని తళుకులకు వెండితెర నోచుకోవడం లేదు. హీరోయిన్గా ఛార్మి ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించేసింది. నిర్మాతగా మారి, పూరీ జగన్నాధ్తో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్లో సినిమాలు రూపొందిస్తోంది. నిర్మాత అయితే మాత్రం ఈ మధ్య ఛార్మిలో అందం మరింత రెట్టింపైపోయింది. హీరోయిన్స్ని కాల దన్నే గ్లామర్తో రెచ్చిపోతోంది. హాట్ హాట్గా ఫోటో సెషన్స్ చేయించుకుంటూ, అప్పుడప్పుడూ వాటిని నెట్టింట్లో వదులుతోంది. అంతటి గ్లామర్ కళ్ల ముందర నాట్యం చేస్తుంటే, ఊరికే ఉండరుగా.
హీరోయిన్గా వెండితెరపై మెరిసిపొమ్మని అభిమానులు సలహాలిస్తున్నారట. అయితే, హీరోయిన్గా మళ్లీ కనిపించే ఇంట్రెస్ట్ తనకు లేదంటోంది ఛార్మి. నిర్మాతగానే కెరీర్ హాయిగా ఉందని తెగేసి చెప్పేస్తోంది. పాపం నెటిజన్లు ఛార్మిని అలా సరిపెట్టుకోవల్సిందే. అన్నట్లు ఇటీవల డైరెక్టర్ జయంత్.సి. పరాన్జీ ఇంట్లో జరిగిన పార్టీలో ఛార్మి గ్లామర్ తళుకులు చూపు తిప్పుకోనీయకుండా చేశాయి. ఇంతటి అందం తెరవెనకే ఉండిపోతానంటే, ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవ్వరా మరి. ఇకపోతే, నిర్మాతగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఛార్మి, ప్రస్తుతం ‘రొమాంటిక్’ మూవీ నిర్మాణంలో బిజీగా ఉంది. ఆకాష్ పూరీ, కేతికా శర్మ జంటగా ఈ సినిమా తెరకెక్కుతోంది.