చిన్మయికి జరిగిన తీరని అవమానం అందుకేనా.?

మరిన్ని వార్తలు

గాయని చిన్మయి పేరు ఈ మధ్య హాట్‌ టాపిక్‌ అయ్యింది. అందుకు కారణం తమిళ ప్రముఖ పాటల రచయితపై చిన్మయి మీటూ ఆరోపణలు చేయడమే. ఆ కారణంగా ఆమె పలు వివాదాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఛాలెంజ్‌ కూడా చేసింది. అయితే లేటెస్టుగా చిన్మయికి తమిళంలో అవమానం జరిగింది. ఆమె పాడిన పాటకు పేరు వేయకపోవడం ఆమెని అవమానించినట్లే కదా. తమిళ నటుడు ప్రముఖ సంగీత దర్శకుడు అయిన జీవి ప్రకాష్‌ హీరోగా తెరకెక్కిన 'సర్వం తాళమయం' సినిమాకి సంబంధించి ఓ లిరికల్‌ వీడియో సాంగ్‌ విడుదలైంది.

తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలోని ఈ పాటకు తెలుగు వెర్షన్‌లో షాషా త్రిపాఠి తన గాత్రమివ్వగా, తమిళ వెర్షన్‌ చిన్మయి పాడింది. అయితే ఈ లిరికల్‌ వీడియో టైటిల్స్‌లో షాషా త్రిపాఠి పేరును ప్రస్థావించారు కానీ, చిన్మయి పేరు ప్రస్థావించలేదు. ఈ విషయాన్ని గమనించిన చిన్మయి అభిమాని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టగా, ఆ పోస్ట్‌కు స్పందించిన చిన్మయి ఇది తనకు జరిగిన అవమానంగా భావిస్తున్నానని బాధపడింది.

మాయ మాయ..' అంటూ సాగే ఈ లిరికల్‌ వీడియో సాంగ్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అయితే అందులో తన పేరు ప్రస్థావనకు రాలేదు. అలాగే మరో రెండు లిరికల్‌ వీడియోస్‌నీ పరిశీలించిన చిన్మయి తన పేరు ప్రస్థావన లేదన్న సంగతిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి, ఇది తనకు జరిగిన తీరని అవమానంగా పేర్కొన్నారు. ఈ రకంగా తమిళ సినీ పరిశ్రమలో గాయని చిన్మయిపై భారమైన వేటు పడినట్లైంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS