కొణిదెల శివ శంకర వరప్రసాద్.. చిరంజీవిగా ఎలా మారారు.? అంటే, ఆంజనేయుడిపై అపారమైన భక్తి కారణంగానే. హనుమంతుడిపై తన భక్తి గురించి చిరంజీవి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆసక్తికరమైన అంశాల్ని పంచుకున్నారు. ‘ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామితో నాకు చాలా అనుబంధం వుంది. చిన్నప్పటినుంచి.. 1962లో ఓ లాటరీలో ఓ బొమ్మ వచ్చింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా వుంది.. అని చెప్పడం కంటే, దాచుకున్నాను అని చెప్పడం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా.?’ అంటూ ఆసక్తికరమైన విషయాన్ని ట్వీట్ చేశారు చిరంజీవి.
‘ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్నగారు.. ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు.. అచ్చం నీకు అలానే వున్నాయని అన్నారు..’ అంటూ అప్పుడు తనకు వచ్చిన ఆ లాటరీ ఫొటో, అలాగే అప్పటి తన ఫొటో పోస్ట్ చేశారు మెగాస్టార్. అన్నట్టు, ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు బాపు చిరంజీవి కోసం ఓ హనుమంతుడి బొమ్మ గీశారు. ‘బొమ్మని గీస్తోంటే మీ పోలికలే వస్తున్నాయండీ..’ అని బాపు, చిరంజీవితో అన్నారట. చిరంజీవి ఆ బొమ్మని, మార్బుల్ మీద రీ-ప్రొడ్యూస్ చేయించి తన ఇంట్లోని పూజగదిలో పెట్టుకున్నారు. ఆ ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. హనుమంతుడి మీద చిరంజీవి భక్తి అలాంటిది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో చిరంజీవి ఓ ఫైట్లో హనుమంతుడి అవతారంలో కన్పిస్తారు.
ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది...చిన్నప్పటి నుంచి...1962 లో నాకు ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా?...to be continued pic.twitter.com/TdVKjg05nS
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020