మెగాస్టార్ ఆశీస్సులు అందుకున్న జాతీయ ఉత్త‌మ‌ న‌టి కీర్తి సురేష్

మరిన్ని వార్తలు

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని మెగాస్టార్‌ చిరంజీవిని చూస్తే అర్ధమవుతుంది. అందుకే కష్టపడి పైకి వచ్చిన వాళ్లందరికీ చిరంజీవే ఇన్సిప్రేషన్‌. 'మహానటి'గా జాతీయ అవార్డు అందుకున్న కీర్తిసురేష్‌ కూడా చిరంజీవి బాటలోనే నడుస్తుందనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ మరొకటి ఉండదేమో. తాజాగా జరిగిన సైమా అవార్డ్స్‌ ఫంక్షన్‌లో చిరంజీవి కాళ్ల దగ్గర కూర్చొని కీర్తిసురేష్‌ మాట్లాడడం, అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

 

సైమా అవార్డ్స్‌ ఫంక్షన్‌లో చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిసిన కీర్తిసురేష్‌ చాలా సేపు ఆయన కాళ్ల దగ్గరే కూర్చొని ముచ్చటించింది. నిజానికి 'మహానటి'గా అవార్డు అందుకున్న కీర్తి, చిరంజీవి పక్కన కూర్చొని మాట్లాడగల స్థాయి ఉన్నదే. కానీ, తన స్థాయి ఏంటో తనకు తెలుసు. అలాగే మెగాస్టార్‌ అంతటి వ్యక్తి వద్ద తన స్థాయి ఏంటని గుర్తించింది కాబట్టే, ఆయన పట్ల అంత మర్యాదగా వ్యవహరించింది. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న కీర్తిసురేష్‌, చిరంజీవి ఫోటో కీర్తి పట్ల ఉన్న గౌరవం మరింత పెరుగేలా చేసింది.

 

సైమా అవార్డ్స్‌లో కీర్తిసురేష్‌కి మరో అవార్డ్‌ దక్కింది. అలాగే 'రంగస్థలం' చిత్రానికి సంబంధించి, చరణ్‌కి వచ్చిన అవార్డును అందుకోవడానికి చిరంజీవి కూడా ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు. ఇదిలా ఉంటే, చిరంజీవి తదుపరి చిత్రం లో కీర్తిసురేష్‌ నటించే అవకాశాలున్నాయంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, త్వరలోనే ఈ కాంబోని తెరపై కూడా చూడొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS