అప్పుడు ప్రతిబంద్.. ఇప్పుడు ఛత్రపతి

మరిన్ని వార్తలు

బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో పరిచయం అవుతున్నాడు. రాజమౌళి, ప్రభాస్ ల ఛత్రపతి సినిమాని బాలీవుడ్ లో అదే టైటిల్ తో రీమేక్ చేశాడు. వివి వినాయక్ ఈ రీమేక్ కి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ట్రైలర్ బయటికి వచ్చింది. మే 12న సినిమా హిందీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ రీమేక్ లో  మార్పులు చేయలేదట వినాయక్. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.


‘రాజమౌళి గారి ఛత్రపతిని యధాతధంగా తీశాం. మార్పులు జోలికి వెల్లలేదు. ఛత్రపతి ఐకానిక్ సినిమా. అందులో మార్పులు చేస్తే ఆత్మ చెడిపోతుంది. పైగా ఛత్రపతిలో కొన్ని క్లాసిక్స్ షాట్స్ వున్నాయి. వాటిని రిక్రియేట్ చేయాలని ప్రయత్నించాం’’ అని చెప్పుకొచ్చారు వినాయక్.


శ్రీనివాస్ తెలుగు హీరో కదా.. మరి ఈ సినిమాని తెలుగులో ఎందుకు డబ్ చేయలేదనే ప్రశ్నకు బెల్లంకొండ సురేష్ సమాధానం ఇస్తూ.. ‘’తెలుగు ఛత్రపతిని అందరూ చూశారు. ఇప్పుడు డబ్బింగ్ విడుదల చేయడం వలన ప్రత్యేకత ఏమీ వుండదు. ఇది హిందీ కోసం తీశాం. కేవలం హిందీలోనే విడుదల చేయాలని ముందు నుంచే అనుకున్నాం. చిరంజీవి గారు ప్రతిబంద్ అనే హిందీ సినిమా చేశారు. తెలుగు డబ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని హిందీ సినిమాగానే చూశారు. ఛత్రపతి కూడా మేము అలానే అనుకున్నాం’’ అన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS