అక్కినేని నాగచైతన్య, దర్శకుడు పరశురాంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 'కస్టడీ' ప్రమోషన్స్ లో పరశురామ్తో సినిమా గురించి ప్రస్థావించగా ‘‘ఆయన గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్. ఆయన నా టైమ్ వేస్ట్ చేశారు’’ అని నిర్మోహమాటంగా సమాధానం ఇచ్చాడు. గీత గోవిందం తర్వాత పరశురామ్, నాగచైతన్యతో సినిమా చేయాలి. ఈ సినిమాకి నాగేశ్వరరావు అనే టైటిల్ కూడా అనుకున్నారు.
అన్నీ ఓకే అనుకున్న సమయంలో పరశురామ్ చైతు సినిమాని పక్కన పెట్టి మహష్ బాబు సర్కారు వారి పాటకు షిఫ్ట్ అయిపోయాడు. ఈ విషయంలో చైతు సమయం చాలా వృధా అయ్యింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ వైపు టర్న్ తీసుకున్నాడు.
ఈ మొత్తం వ్యవహరంతో నాగచైతన్యకి చిరాకు తెప్పించింది. బేసిగ్గా సినిమా వాళ్ళు చాలా మృదువుగా, కాస్త లౌక్యంతో విషయాలపై స్పందిస్తారు. కానీ చైతు మాత్రం బాహాటంగానే తన అసహనాన్ని ప్రకటించాడు. ఎంతలా చిరాకు పెట్టివుంటే ఇంతలా రియాక్ట్ అయ్యింటారో అర్ధం చేసుకోవచ్చు. చైతు తీరు చూస్తుంటే ఇక పరశురాంతో సినిమా లేనట్లే కనిపిస్తోంది.