చిరు - చరణ్‌ కాంబో, ఏప్రిల్‌లో సెట్స్‌ మీదకి

మరిన్ని వార్తలు

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ మెగా ప్రొడ్యూసర్‌ అయిపోయాడు. తొలి సినిమాతోనే నిర్మాతగా సంచలన విజయం అందుకున్న ఉత్సాహం కొనసాగించడానికి చరణ్‌ సన్నద్ధమవుతున్నాడు. రెండో సినిమాని కూడా తన తండ్రితోనే రామ్‌చరణ్‌ నిర్మించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్‌లో సెట్స్‌ మీదకు రానుందని చరణ్‌ చెప్పాడు. అయితే ఈ సినిమాకి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నాడని ఇదివరకే ఖాయమైంది. స్టయిలిష్‌ దర్శకుడు సురేందర్‌రెడ్డి, చరణ్‌ హీరోగా 'ధృవ' సినిమాని తెరకెక్కించి, ఘనవిజయాన్ని అందుకున్నాడు. అది తమిళ సినిమా 'తని ఒరువన్‌'కి రీమేక్‌. ఆ సినిమా టైమ్‌లోనే చిరంజీవితో సినిమా చేయాలని ఉందని సురేందర్‌రెడ్డి చెప్పాడు. 'కిక్‌' తరహా స్టైలిష్‌ ఎంటర్‌టైనర్‌ని చిరంజీవితో చేయాలని ఉన్నట్లు ఆయన వివరించాడు. దీనికి సంబంధించి కథ కూడా ఓకే అవడంతోనే చరణ్‌, సురేందర్‌రెడ్డి - చిరు కాంబినేషన్‌లో సినిమాపై ప్రకటన చేసినట్లు సమాచారమ్‌. ఇంకో వైపున చరణ్‌, సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు. ఈ సినిమా ఓ కొలిక్కి రాగానే కొరటాల దర్శకత్వంలో తాను హీరోగా చేసే సినిమాని తన స్వీయ నిర్మాణంలోనే చరణ్‌ సెట్స్‌ మీదకు తీసుకువెళతాడట. అంటే ఈ ఏడాది మెగానామ సంవత్సరంగా భావించవలసి ఉంటుందేమో. ఏదేమైనా సక్సెస్‌ ఇచ్చిన జోష్‌ చరణ్‌లో బాగా కనిపిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమకి ఓ మంచి నిర్మాత దొరికాడు చరణ్‌ రూపంలో. అయితే చరణ్‌ ఇతర హీరోలతోనూ సినిమాలు చేస్తాడా? లేదా? అన్నదైతే సస్పెన్స్‌గానే ఉందిప్పటికి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS