‘ఆచార్య’ సినిమాలో తొలుత మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్గా త్రిషని ఎంపిక చేసిన విషయం విదితమే. అయితే, ఇప్పుడు త్రిష స్థానంలోకి కాజల్ అగర్వాల్ వచ్చి చేరింది. ‘మొదట అనుకున్న విషయాలకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. అందుకే సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది..’ అని చెబుతూనే, ‘ఆచార్య’ టీవ్ుకి ఆల్ ది బెస్ట్ చెప్పేసింది త్రిష. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి తాజాగా స్పందించారు. ‘త్రిషకి మరో సినిమాలో ఛాన్స్ వచ్చింది. అది మణిరత్నం సినిమా. దాంతో డేట్స్ అడ్జస్ట్ చేయడం ఆమెకు కష్టంగా మారింది. అందుకే ఆమె సినిమా నుంచి తప్పుకుంది..’ అని చిరంజీవి వ్యాఖ్యానించడం గమనార్హం.
మరి, చిరంజీవి స్టేట్మెంట్తో త్రిష ఏకీభవిస్తుందా.? తనదైన స్టయిల్లో ఇంకోసారి ఈ వ్యవహారంపై స్పందిస్తుందా.? అన్నది చర్చనీయాంశంగా మారింది. గతంలో ‘సామి-2’ నుంచి కూడా త్రిష ఇలాగే తప్పుకుంది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందనుకోండి. అది వేరే సంగతి. నిజానికి త్రిష కెరీర్లో ఇప్పుడు ఏమంత జోరు లేదు. పైగా, టాలీవుడ్లో ఆమెకు అస్సలేమాత్రం క్రేజ్ లేదు. చిరంజీవి సరసన త్రిష.. అనగానే చాలామంది ఆశ్చర్యపోయారు. ఆమె ప్లేస్లోకి కాజల్ వచ్చి చేరడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే చిరు - కాజల్ కాంబినేషన్లో వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక, ‘ఆచార్య’ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెల్సిందే.