ఓటీటీ వైపు చూస్తోన్న మెగాస్టార్‌.. ఈసారి పక్కా!

మరిన్ని వార్తలు

‘ఆచార్య’ సినిమా షూటింగ్‌కి త్వరలో మెగాస్టార్‌ చిరంజీవి హాజరవుతారు. నిజానికి, ఈపాటికే ఆయన సెట్స్‌లో జాయిన్‌ అవ్వాల్సి వుండగా, కరోనా కారణంగా కాస్త వెనక్కి తగ్గారు. కరోనా పాజిటివ్‌ వచ్చిందని తేలేసరికి.. ‘ఆచార్య’ షూటింగ్‌ కొంత అయోమయంలో పడింది.. కరోనా లేదని తెలిశాక.. చిరులోనూ కొత్త ఉత్సాహం కనిపించింది. ఇదిలా వుంటే, మెగాస్టార్‌ చిరంజీవి కన్ను కూడా ఓటీటీపై పడిందట. ఓటీటీ రిలీజ్‌ కోసం ఓ సినిమా లాంటిది చెయ్యాలనే ఆలోచనలో మెగాస్టార్‌ వున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఓ యువ దర్శకుడు మెగాస్టార్‌ చిరంజీవికి ఇటీవలే ఓ పవర్‌ఫుల్‌ స్టోరీ చెప్పాడనీ, తొలుత సినిమాగా చేస్తే బావుంటుందనే ఆలోచన చేసిన చిరంజీవి, ప్రస్తుతం ఓటీటీ ఫార్మాట్‌లో చేస్తే ఎలా వుంటుంది.? అని ఆలోచిస్తున్నరట. అన్నీ కుదిరితో అతి త్వరలోనే ఆ దర్శకుడితో ఓటీటీ విషయాన్ని అనౌన్స్‌ చేస్తారని సమాచారం. ఎవరా దర్శకుడు.? ఏమా కథ.? అన్నది ఇంకా తేలాల్సి వుంది. అయితే, జస్ట్‌ పది పదిహేను రోజుల షూట్‌తో ఆ ప్రాజెక్ట్‌ పూర్తయిపోయేలా మెగాస్టార్‌కి మొత్తం ప్లాన్‌ వివరించాడట సదరు యువ దర్శకుడు. యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ అయిన ఆ యువ దర్శకుడి ఆలోచనలకు మెగాస్టార్‌ ఫిదా అయ్యారని సమాచారం. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS