థర్టీ ఇయర్స్‌ పృధ్వీ జాక్‌పాట్‌ కొట్టేశాడు

మరిన్ని వార్తలు

సినీ నటుడు పృధ్వీ జాక్‌పాట్‌ కొట్టాడు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పని చేసిన పృధ్వీకి జగన్‌ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన శ్రీ వెంకటేశ్వరా భక్తి ఛానెల్‌ చైర్మన్‌గా అవకాశం కల్పించింది. గత కొన్నాళ్లుగా ఈ విషయమై ఊహాగానాలు వినిపిస్తుండగా, అధికారికంగా, నిన్న ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ధృవీకరించింది.

 

గతంలో ఈ బాధ్యతల్ని సీనియర్‌ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్వహించారు. అంతటి పెద్ద పదవి పృధ్వీకి దక్కడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అయితే, జగన్‌తో కలిసి ప్రజా సంకల్ప యాత్రలో హల్‌చల్‌ చేయడం, రాజకీయ ప్రత్యర్ధులపై మాటల తూటాలూ పేల్చడం ద్వారా జగన్‌ దృష్టిని ఆకర్షించడం.. ఇలా పృధ్వీకి పదవి దక్కడం వెనక చాలా కారణాలున్నాయి.

 

టీడీపీకి వ్యతిరేకంగా, ఇతర పార్టీలకు వ్యతిరేకంగా వ్యవహరించాడన్న ఆరోపణలతో కొన్ని సినిమా ఛాన్సులు కూడా పృధ్వీకి దూరమయ్యాయి. ఈ నేపథ్యంలో అందరూ షాక్‌ అయ్యేలా పృద్వీ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే, పృధ్వీ కోసం మరో పెద్ద పదవి సిద్ధమవుతోందనీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే, పార్టీ పరంగా కూడా చెప్పుకోదగ్గ పదవే పృధ్వీకి వుంది. చక్కటి వాగ్ధాటి, సినీ నటుడిగా బోలెడంత మంది అభిమానులు ఇవన్నీ, పృధ్వీకి కలిసొచ్చాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS