'సంజూ'ని చుట్టుముట్టిన వివాదం

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్‌ దత్‌ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న 'సంజూ' చిత్ర ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఈ బయోపిక్‌ అనుకున్నప్పటి నుండీ భారీగా అంచనాలు నమోదు చేసింది. ట్రైలర్‌ వచ్చాక ఆ అంచనాలు వందలు వేల రెట్లు పెరిగిపోయాయి. టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న రణ్‌వీర్‌ కపూర్‌ అచ్చం సంజయ్‌దత్‌లాగే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేశాడు. 

ఇకపోతే ఈ మధ్య కొన్ని ప్రముఖ చిత్రాలను వివాదాలు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఈ సినిమాకీ ఓ వివాదం చుట్టుకుంది. ట్రైలర్‌లో జైలు బారక్‌లో టాయిలెట్‌ లీకేజ్‌ సీన్‌ అభ్యంతరకరంగా ఉందనీ, ఇండియన్‌ జైళ్ల మీద చెడు అభిప్రాయాన్ని రేకెత్తించేలా ఉందనీ, ఓ కార్యకర్త సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ వద్ద ఫిర్యాదు చేశాడు. సినిమాలో ఈ సీన్‌ తొలిగించకపోతే, సినిమా విడుదల ఆపేస్తానని సదరు కార్యకర్త ఆందోళన చేస్తూ, చిత్రయూనిట్‌కి లేఖ రాశాడు. చిత్ర యూనిట్‌ స్పందించకపోతే, తర్వాతి పరిణామాలు తీవ్రంగా ఉంటాయనీ ఆ వ్యక్తి ఆందోళన చేస్తున్నాడు. 

చూడాలి మరి ఈ వివాదంలో చిత్ర యూనిట్‌ ఎలా స్పందిస్తుందో. ఇకపోతే అలనాటి మేటి నటి నర్గీస్‌ పాత్రలో సీనియర్‌ బాలీవుడ్‌ నటి మనీషా కోయిరాల నటిస్తోంది. రియల్‌ లైఫ్‌లో క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన మనీషా కోయిరాల రీల్‌ లైఫ్‌లోనూ అదే పాత్రను పోషించడం విశేషం. క్యాన్సర్‌ బాధితుల బాధ ఎలా ఉంటుందో తనకి ప్రాక్టికల్‌గా తెలిసినా, ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు మనీషా చాలా కష్టపడిందట.

రాజ్‌కుమార్‌ హీరాణీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సంజూ' జూన్‌ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS