పవన్ కళ్యాణ్ పార్టీలోకి ప్రముఖ క్రికెటర్

మరిన్ని వార్తలు

పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఉత్తరాంధ్రలో కొనసాగుతున్నది. ఇక తాజాగా ఆయన విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు, అక్కడి మేధావులతో కలిసి ఆ ప్రాంత అభివృధికి ఏం చేస్తే బాగుంటుంది అన్న కోణంలో ఆయన చర్చలు జరుపుతున్నారు.

ఇక ఇందులో భాగంగానే విశాఖపట్నంకి చెందిన పలువురు ప్రముఖులు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తూ జనసేన పార్టీలో చేరారు. అందులో ప్రముఖ అంతర్జాతీయ క్రికెటర్ వేణుగోపాల రావు ఉన్నారు, ఈయన ఇండియా తరపున 16 గేమ్స్ ఆడిన ఆయన తెలుగు రాష్ట్రాల నుండి దేశానికి క్రికెట్ లో  ప్రాతినిధ్యం వహించించిన వారి జాబీతాలో చోటు సంపాదించుకున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ పర్యటనతో విశాఖ లోని జనసేన కార్యకర్తలకి కొత్త ఊపు వచ్చిన ఈ సమయంలో పలువురు ప్రముఖులు పార్టీలో చేరడం ఆసక్తికరంగా మారింది.

మరి వేణుగోపాల్ రావు వచ్చే సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS