దర్శకరత్న 'దాసరి' ఇంట కలకలం రేపిన 'ఆస్తుల' వివాదం

మరిన్ని వార్తలు

దర్శకరత్న దాసరి నారాయణరావు ఇంట ఆస్తుల తగాదా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే, దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు అయిన దాసరి ప్రభు భార్య అంటూ సుశీల అనే స్త్రీ నిన్న దాసరి ఇంటికి పలువురు మహిళా సంఘాల వారితో వచ్చింది. ఇది తెలుసుకుని అక్కడికి వెళ్ళిన మీడియా వారికి తమకి 1995లోనే వివాహం అయింది అని మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించి తమది ప్రేమ వివాహం అయిన కారణంగా మొదట్లో తమ వివాహాన్ని దాసరి దంపతులు ఆమోదించలేదు అని, ఆ తరువాత కాలంలో తమ పెళ్ళిని అంగీకరించి పంజాగుట్ట సమీపంలో తమకి ఒక ఇంటిని కేటాయించి అక్కడ ఉంచారని తెలిపింది.
అయితే దాసరి గారు చనిపోయే ముందు కలిస్తే, తప్పకుండా తమకి న్యాయం చేస్తాను అని చెప్పడమే గాక తన కుమారుడిని హీరోగా కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను అని మాట ఇచ్చరాట.

ఇక ఆయన చనిపోయాక తనని మిగతా కుటుంబసభ్యులు పట్టించుకోవడం లేదని, పంజాగుట్ట ఇంటికి కూడా అద్దె చెల్లించకుండా ఉండేసరికి తాను ఇప్పుడు అక్కడ కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది అని చెప్పుకొచ్చింది.

అందుకనే ఇప్పుడు దాసరి నారాయణరావు గారి ఇంటి కోడలిగా ఆయన ఇంటిలో ఉండే హక్కు ఉన్నందున తాను ఇక్కడికే వచ్చేసినట్టుగా తెలిపారు.

ఏదేమైనా.. దాసరి నారాయణరావు గారి ఇంటి సమస్య ఇలా రోడ్డున పడడం శోచనీయం...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS