'కామ్రేడ్‌' స్పీడు పెంచేశాడోచ్‌!

మరిన్ని వార్తలు

సంచలనాల్లో విజయ్‌దేవరకొండ సంచలనాలే వేరయా. ఈ సంచలన హీరో సినిమా వచ్చి నిజానికి చాలా కాలమే అయ్యింది. 'ట్యాక్సీవాలా' సినిమా తర్వాత రౌడీస్టార్‌ నుండి ఇంకో సినిమా రానేలేదు. కానీ, ఆయనకున్న క్రేజ్‌ మాత్రం తగ్గనేలేదు. భారీ అంచనాల నడుమ తాజా చిత్రం 'డియర్‌ కామ్రేడ్‌' రాబోతోంది. ఈ నెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

ఏ సినిమాతో అయితే బ్లాక్‌ బస్టర్‌ వసూళ్లు కొల్లగొట్టాడో.. అదే సినిమా కాంబో ఈ సినిమాతో మరోసారి రిపీట్‌ అవుతోంది. అదే విజయ్‌ దేవరకొండ - రష్మికా కాంబో. ఈ కాంబోకే బోలెడంత క్రేజ్‌ ఉంది. ఇక బ్యానర్‌ పరంగా చూస్తే 'రంగస్థలం' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ రికార్డున్న మైత్రీ మూవీస్‌ బ్యానర్‌. కంటెంట్‌ పరంగా యూత్‌ కంటెంట్‌ మూవీ. ఇవి చాలవూ.. రౌడీ బాక్సాఫీస్‌ రికార్డులు మళ్లీ కొల్లగొట్టడం ఖాయమనడానికి. అంచనాలకు తగ్గట్లుగానే ప్రమోషన్స్‌ కూడా ఉండాలి కదా. అందుకే ఇక సినిమా రిలీజ్‌ దగ్గర పడిన ఈ తరుణంలో ప్రమోషన్స్‌ వేగవంతం చేశాడు. ఇప్పటికే మైత్రీ వారు ఎయిర్‌టెల్‌తో టై అప్‌ అయ్యి వినూత్నంగా ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేశారు.

 

ఎయిర్‌టెల్‌ 'డియర్‌ కామ్రేడ్‌' స్పెషల్‌ ప్యాకేజీల పేరుతో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ సినిమాకి ప్రమోషన్స్‌ చేస్తున్నారు. ఇక తాజా అప్‌డేట్‌ ఏంటంటే, మరో మూడు రోజుల్లో 'డియర్‌ కామ్రేడ్‌' ట్రైలర్‌ వదలనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్‌ ప్రోమోలు యూత్‌ని ఉర్రూతలూగిస్తున్నాయి. ఇక ఆ ట్రైలరేదో వచ్చిందంటే, ఆ అంచనాలు ఎంతలా బోర్డర్‌ దాటేస్తాయో ఊహించడమే కష్టంగా ఉంది. భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ స్టూడెంట్‌ లీడర్‌గా కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS