నిర్మాతగా మారనున్న దీపికా పదుకొనె.!

మరిన్ని వార్తలు

ఇటీవలే కోరుకున్న ప్రియుడు రణవీర్ సింగ్ని పెళ్లాడి ఓ ఇంటిదైంది బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనె. వరల్డ్‌లోనే కాస్ట్‌లీయెస్ట్‌ మ్యారేజ్‌గా దీపికా వివాహాన్ని అభివర్ణించారు. ఇకపోతే పెళ్లి మూడ్‌ నుండి బయటికి వచ్చేసిన దీపికా తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది. గ్లామర్‌ తారగానే కాకుండా, విభిన్నమైన పాత్రల్లోనూ నటించి మెప్పించేసింది ఇప్పటికే దీపికా పదుకొనె. పెళ్లి తర్వాత దీపికా నుండి రాబోయే ప్రాజెక్ట్‌ ఎలాంటిదై ఉంటుందా అని అభిమానుల్లో ఆశక్తి నెలకొంది.

ఈ లోగా ఓ బయోపిక్‌పై దీపికా దృష్టి పడింది. యాసిడ్‌ బాధితురాలి పాత్రలో దీపికా నటిస్తోంది. 'తల్వార్‌', రాజీ' చిత్రాల ఫేం మేఘనా గుల్జార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా దాదాపు పదమూడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో యాసిడ్‌ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందట. ఈ సినిమాలో యాసిడ్‌ దాడికి సంబంధించిన అంశాల్ని లార్జ్‌ స్కేల్‌లో చూపించాలని చిత్రయూనిట్‌ భావిస్తోందట. ఒకానొక టైంలో లవ్‌కి నో అన్నదని అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్‌ దాడితో అరాచకం సృష్టించేశారు.

కానీ ఇప్పుడా పరిస్థితికి కొంచెం ఉపశమనం జరిగిందనే చెప్పాలి. ప్రపంచంలో ఎక్కడా యాసిడ్‌ దాడి కేసులు దాదాపుగా నమోదు కావడం లేదు. ఇది మంచి పరిణామమే. ఇలా గతంలో తనపై జరిగిన యాసిడ్‌ దాడిని అధిగమించి జీవితంలో తాను అనుకున్న లక్ష్యాన్ని ఓ అమ్మాయి ఎలా అందుకుంది అనే కథనాన్ని కళ్లకు కట్టినట్లుగా హృద్యంగా చూపించబోతున్నారట ఈ సినిమాలో.దీపికా పదుకొనె ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ పోషిస్తూ నిర్మాతగా కూడా వ్యవహరించనుందట. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS