ఈ 'వీఐపీ'కి ఏమయ్యింది?

మరిన్ని వార్తలు

ధనుష్‌ హీరోగా నటించిన 'వీఐపీ2' విడుదల వాయిదా పడింది. ఈ వార్త వినగానే ధనుష్‌ అభిమానులు చాలా నిరాశకు గరయ్యారు. అభిమానులను డిజప్పాయింట్‌ చేసినందుకు క్షమించాలంటూ చిత్ర నిర్మాతలు స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేశారు. ఆగస్ట్‌ నెలలో సినిమా విడుదల కానుందట. ముందుగా ఈ చిత్రాన్ని ధనుష్‌ పుట్టినరోజున అంటే జులై 28న విడుదల చేయాలనుకున్నారు. అనివార్య కారణాలతో సినిమా విడుదల వాయిదా పడిందని చిత్ర నిర్మాత ప్రకటించారు. తెలుగులో 'రఘువరన్‌ బిటెక్‌' పేరుతో ధనుష్‌ హీరోగా విడుదలైన సినిమా సంచలన విజయం అందుకుంది. దానికి సీక్వెల్‌ 'విఐపి-2'. ఈ చిత్రంలో బాలీవుడ్‌ సీనియర్‌ భామ కాజోల్‌ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ధనుష్‌ - కాజల్‌ మధ్య సన్నివేశాలు సినిమాకే హైలైట్‌ అవుతాయట. గ్లామరస్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఓ ఊపు ఊపేసిన కాజోల్‌ ఈ సినిమాలో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తోంది. డస్కీ బ్యూటీ అమలాపాల్‌ ఈ సినిమాలో ధనుష్‌ సరసన హీరోయిన్‌గా కనిపించనుంది. 'రఘువరన్‌ బీటెక్‌'లో కూడా అమలాపాలే హీరోయిన్‌గా నటించింది. తొలి పార్ట్‌కి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి టాక్‌ వచ్చింది. యూత్‌కి బాగా కనెక్ట్‌ అయిన సినిమా అది. అలాగే ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ సినిమాని మించిన రేంజ్‌ పవర్‌ ఫుల్‌ స్టోరీ అట ఈ సినిమా. సౌందర్యా రజనీకాంత్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించనుంది చిత్ర యూనిట్‌.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS