మెగా కాంపౌండ్‌కి సురేందర్‌రెడ్డి లాకయ్యాడా.?

మరిన్ని వార్తలు

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన 'రేసుగుర్రం' సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ తర్వాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో 'ధృవ' బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. ఇప్పుడు మెగాస్టార్‌తో 'సైరా నరసింహారెడ్డి'తో సురేందర్‌రెడ్డి బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకూ సురేందర్‌రెడ్డి 'సైరా' పనుల్లో బిజీగా ఉంటాడు. ఆ తర్వాత ఆయన తెరకెక్కించబోయే సినిమా ఏంటీ.? అంటే మరోసారి మెగా కాంపౌండ్‌ మూవీనే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఎందుకంటే సురేందర్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'ధృవ' సినిమా తమిళంలో విజయవంతమైన 'తనీఒరువన్‌'కి రీమేక్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

 

తమిళంలో 'తనీ ఒరువన్‌' సీక్వెల్‌కి రంగం సిద్ధమవుతోంది. సేమ్‌ డైరెక్టర్‌, సేమ్‌ హీరో, హీరోయిన్లతో ఈ సీక్వెల్‌ రూపొందనుంది. మోహన్‌రాజా దర్శకత్వంలో జయం రవి, నయనతార జంటగా తెరకెక్కిన ఈ చిత్రం సీక్వెల్‌లో కూడా ఇదే టీమ్‌ వర్క్‌ చేయనున్నారు. ఆ లెక్కల్లో చూస్తే రామ్‌చరణ్‌ కూడా తెలుగులో 'ధృవ'కి సీక్వెల్‌ చేస్తాడేమో.

 

ఒకవేళ అదే జరిగితే సురేందర్‌రెడ్డిని చరణ్‌ లాక్‌ చేసినట్లే. తమిళంలో 'తనీ ఒరువన్‌ 2' జనవరిలో ప్రారంభం కానుంది. మరి 'ధృవ 2' సంగతేంటో కానీ, ప్రస్తుతం రామ్‌చరణ్‌ 'వినయ విధేయ రామ' సినిమాతో బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తర్వాత నిర్మాతగా 'సైరా' బాధ్యతలు చూసుకోవాల్సి ఉంది. అలా సురేందర్‌రెడ్డి, చరణ్‌ ఒకేసారి ఖాళీ అవుతారు. అప్పుడేమైనా 'ధృవ 2' కోసం ఓ ఆలోచన చేస్తారేమో చూడాలి మరి. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS