తేజ భలే ఛాన్స్‌ మిస్‌ చేసుకున్నాడే.!

మరిన్ని వార్తలు

'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ తేజ 'ఎన్టీఆర్‌' బయోపిక్‌తో అద్భుతమైన ఛాన్స్‌ దక్కించుకున్నాడు. అయితే చేతులారా ఆ అవకాశాన్ని తేజ వదులుకున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్టుగా జరిగిన 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా అందరూ తేజను తలచుకున్నారు. ఇంత గొప్ప ఈవెంట్‌లో తేజ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ అయ్యేవాడు. ఆ అరుదైన అవకాశాన్ని వదులుకున్నాడు. మళ్లీ మళ్లీ ఇలాంటి అవకాశాలు రానే రావు. 

 

సినిమా సక్సెస్‌ అయినా కాకపోయినా, స్టార్‌ డైరెక్టర్స్‌ ఇమేజ్‌ అందుకునేవాడు తేజ ఈ సినిమాతో. అహంకారంతోనే తేజ ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకున్నాడని కొందరు అంటున్నారు. అయితే పైకి చెప్పలేని బలమైన కారణాలు ఎన్నో తేజను ఈ సినిమాకి దూరం చేశాయని ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి వచ్చిన ఛాన్స్‌ మిస్‌ చేసుకుని విమర్శకులకు టార్గెట్‌ అయ్యాడు తేజ.

 

ఇదిలా ఉంటే, 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తర్వాత తేజ నుండి మరో సినిమా రాలేదు. కాజల్‌ అగర్వాల్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ జంటగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఆ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. ఎవరికీ అంతగా ఆశక్తి కూడా లేదీ సినిమాపై. సో చాన్నాళ్ల తర్వాత 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో వచ్చిన సక్సెస్‌ ఇమేజ్‌ని మళ్లీ తేజ నిలబెట్టుకోవడం ఈలోగా సాధ్యపడే విషయమేనా.? ఏమో చూడాలిక.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS