రానా కోసం 'బ్రాండ్‌' బ్యూటీ మళ్లీ వస్తోందా?

మరిన్ని వార్తలు

'లోఫర్‌' సినిమాలో మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ సరసన నటించి, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ముద్దుగుమ్మ దిశా పటానీ, ఆ సినిమా ఆశించిన విజయం అందుకోకపోవడంతో, మళ్లీ ఇటువైపు టర్న్‌ తీసుకోలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది దిశాపటానీ. సినిమాల కన్నా, అమ్మడికి సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజే వేరు.

 

ఇన్నర్‌ వేర్‌ కాల్విన్‌ క్లెయిన్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా, దాన్ని ప్రమోట్‌ చేయడంలో దిశా పటానీ చేసిన హాట్‌ హాట్‌ సాహసాలు మరో బ్రాండ్‌ అంబాసిడర్‌ చేసి ఉండదని చెప్పడం అతిశయోక్తి కాదేమో. అలా ఆమె నటించిన తొలి సినిమానే మర్చిపోయి, ఆమె బ్రాండ్‌ 'కాల్విన్‌ క్లెయిన్‌' మాత్రమే గుర్తుంచుకునేంతలా దిశాపటానీ పాపులర్‌ అయిపోయింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే, ఈ బ్రాండ్‌ భామ ఇప్పుడు మళ్లీ తెలుగులో ఓ సినిమాలో నటిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. అది రానా నటిస్తున్న చిత్రమనీ తెలుస్తోంది.

 

రానా ప్రస్తుతం 'విరాటపర్వం' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తోంది. ఇతర కీలక పాత్రల్లో ప్రియమణి తదితరులు నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం గెస్ట్‌గా దిశా పటానీ పేరు పరిశీలిస్తున్నారట. నక్సలిజం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఈ పాత్ర చాలా కొద్ది సేపు మాత్రమే కనిపిస్తుందట. కానీ, చాలా ఇంపార్టెంట్‌ రోల్‌ అనీ తెలుస్తోంది. ఈ గెస్ట్‌ రోల్‌ కోసం 'విరాటపర్వం' టీమ్‌ దిశాపటానీతో సంప్రదింపులు జరుపుతున్నారట. చూడాలి మరి, పూరీ హీరోయిన్‌గా తెరంగేట్రం చేసి, ఇప్పుడు రానా సినిమాకి గెస్ట్‌గా రీ ఎంట్రీ ఇవ్వబోతుందేమో హాట్‌ హాట్‌ దిశా పటానీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS