ముదురుతోన్న 'బిగ్‌బాస్‌' వివాదం.!

మరిన్ని వార్తలు

ఈ నెల 21 నుండి తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 బుల్లితెరపై ప్రసారమయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ రియాల్టీ షోని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు కేసుల రూపంలో సన్నధ్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ షోని నిలిపివేయాలంటూ కొన్ని కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కేసు బిగ్‌బాస్‌ని చుట్టుముట్టింది. ఈ కేసు బిగ్‌బాస్‌ మెడకు కాస్త బలంగానే చుట్టుకునేలా కనిపిస్తోంది.

 

షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జునతో పాటు, మరో 10 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ, బంజారాహిల్స్‌, రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లలో ఓ వ్యక్తి తాజాగా కేసు వేశారు. అసభ్యకరమైన సన్నివేశాలుండడంతో, రాత్రి 11 గంటల తర్వాతే ఈ షోని ప్రసారం చేయాలని ఫిటిషనర్‌ తన ఫిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, సినిమాకి ఉన్నట్లుగానే ఈ షోలోని ప్రతీ ఎపిసోడ్‌నీ సెన్సార్‌ చేయాలనీ సదరు వ్యక్తి కోరారు.

 

అయితే, తమపై వేసిన కేస్‌ని కొట్టివేయాలని కోరుతూ బిగ్‌బాస్‌ కోఆర్టినేషన్‌ టీమ్‌ హైకోర్టులో తాజాగా మరో ఫిటీషన్‌ వేసింది. గత రెండు సీజన్స్‌లోనూ ఈ తరహా కేసులు బిగ్‌బాస్‌ షోని వేధించలేదు. కానీ, ఈ సీజన్‌లో ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ప్రసారం కాకుండానే ఇన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇక వన్స్‌ స్టార్ట్‌ అయ్యాకా బిగ్‌బాస్‌ ఇంకెన్ని వివాదాలని ఎదుర్కోవాల్సి వస్తుందో వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS