లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే నిర్మాతలకు కత్తి మీద సామే. కానీ, సమంత 'ఓ బేబీ'తో అలాంటి డౌట్స్ పటాపంచలైపోయాయి. ఈ సినిమా ఆ తరహా మూవీస్కి ఊతమిచ్చినట్లైంది. 'ఓ బేబీ'కి ప్రముఖుల ప్రశంసలతో పాటు, కలెక్షన్లు కూడా బాగా వస్తున్నాయి. ఇదే ఊపు వీకెండ్ రెండు రోజుల్లోనూ కనిపిస్తే, 'ఓ బేబీ' సూపర్ డూపర్ హిట్ ఖాతాలోకి వెళ్లిపోవడం ఖాయం. ఇదిలా ఉంటే, సురేష్ ప్రొడక్షన్స్కి మరో డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఉందట.
అదే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'డ్రీమ్ గాళ్'. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలన్నది ఎప్పటి నుండో సురేష్ ప్రొడక్షన్స్ కోరికట. ఆ దిశగా గతంలోనూ చాలా ప్రయత్నాలు చేసింది కానీ, సాహసం చేయలేకపోయిందట. కానీ, ఇప్పుడు బేబీ ఇచ్చిన ఉత్సాహంతో ఆ రిస్క్ చేసేందుకు ఈ నిర్మాణ సంస్థ ముందుకొచ్చిందనీ తెలుస్తోంది. ఆల్రెడీ ఓ స్పెషల్ టీమ్ ఈ స్క్రిప్టుపై వర్క్ చేస్తోందట. త్వరలోనే స్క్రీప్టు పనులు ఓ కొలిక్కి రానున్నాయట. హీరోగా యంగ్ హీరో రాజ్తరుణ్ని హోల్డ్ చేసి పెట్టిందట సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ.
అయితే, 'డ్రీమ్గాళ్' ఎవరనే విషయమే ప్రస్తుతానికి సస్పెన్స్. అనీష్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయట. రాజ్తరుణ్తో ఈయన 'లవర్' చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతకు ముందే 'అలా ఎలా' సినిమాతో డైరెక్టర్గా పరిచయమయ్యాడు. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్లో 'డ్రీమ్గాళ్' ప్రాజెక్ట్ చేత పట్టాడనే ప్రచారం జరుగుతోంది. సో రాబోయే 'డ్రీమ్గాళ్' ఇటు రాజ్తరుణ్కీ, అటు అనీష్ కృష్ణకి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలిక.