ఓజీ... ఏమిటీ ఈ గంద‌ర‌గోళం?!

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ - సుజిత్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'ఓజీ'. ప‌వ‌న్ రాజ‌కీయాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల్ల ఆయ‌న న‌టిస్తున్న అన్ని సినిమాలూ ఆగిపోయాయి. 'ఓజీ'తో స‌హా. కానీ ఇప్పుడు 'ఓజీ' హ‌ఠాత్తుగా వార్త‌ల్లో నిలిచింది. ఈ సినిమాకి డీవీవీ దాన‌య్య నిర్మాత‌. ఆయ‌న ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకొన్నార‌ని, పీపుల్స్ మీడియా హ్యాండ్ ఓవ‌ర్ చేసుకొంటోంద‌న్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు దాన‌య్య రంగంలోకి దిగారు. ఈ సినిమా ఇంకా మా చేతుల్లోనే ఉంది అంటున్నారు.


నిజానికి తెర వెనుక ఈ సినిమాకి సంబంధించి చాలా క‌థ న‌డుస్తోంద‌ని తెలుస్తోంది. 'ఓజీ' బ‌డ్జెట్లు పెరుగుతున్నాయి. నిర్మాణం ఆల‌స్యం అవుతోంది. హిందీ శాటిలైట్ బిజినెస్ కూడా ఆఖ‌రి నిమిషంలో ఆగిపోయింది. దాంతో దాన‌య్య ఈ భారాన్ని మోయ‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని, దాన్ని త‌గ్గించ‌డానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీని రంగంలోకి దించార‌ని స‌మాచారం. ఇప్ప‌టి నుంచి పెట్టుబ‌డి అంతా పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ పెడుతుంది. లాభాల్లో వాటా తీసుకొంటుంది. దాంతో.. దాన‌య్య భారం త‌గ్గుతుంది.


అయితే ఈ విష‌యాన్ని దాన‌య్య గోప్యంగా ఉంచుతున్నారు. ఇంకా చ‌ర్చ‌లు ప్రాధ‌మిక ద‌శ‌లోనే ఉన్నాయ‌ని, అందుకే నిర్ణ‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌డం లేద‌న్న మాట‌లూ వినిపిస్తున్నాయి. కాక‌పోతే తెర వెనుక ఏదో జ‌రుగుతోంద‌న్న‌ది సుస్ప‌ష్టం. అదేంటో అర్థం కాక ఈ గంద‌ర‌గోళం మొద‌లైపోయింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS