Gopichand Malineni: బాల‌య్య ద‌ర్శ‌కుడికి ప‌వ‌న్ కావాల‌ట‌!

మరిన్ని వార్తలు

ఈ సంక్రాంతికి వ‌చ్చిన సినిమాల్లో `వీర సింహారెడ్డి` ఒక‌టి. బాక్సాఫీసు ద‌గ్గ‌ర యావ‌రేజ్ టాక్ సొంతం చేసుకొంది. వ‌సూళ్లు మాత్రం బాగున్నాయి. క‌ల‌క్ష‌న్ల ప‌రంగా `అఖండ‌` రికార్డుల్ని బ‌ద్దలు కొట్టింది వీర సింహారెడ్డి. ఈ సినిమాతో... గోపీచంద్ మ‌లినేని త‌న స్థానాన్ని ఇంకాస్త సుస్థిరం చేసుకొన్నాడు. ఇప్పుడు గోపీచంద్ త‌దుప‌రి సినిమా ఎవ‌రితో...? అనే చ‌ర్చ మొద‌లైంది. ఇప్ప‌టికే మైత్రీ మూవీస్ సంస్థ‌.. గోపీచంద్ కి అడ్వాన్సులు ఇచ్చేసింద‌ని టాక్‌. ఓ స్టార్ హీరోకి స‌రిప‌డ క‌థ‌.. గోపీచంద్ ద‌గ్గ‌ర సిద్ధంగా ఉంద‌ట‌. ఆ హీరో ఎవ‌ర‌న్న‌ది తెలియాల్సివుంది.

 

అయితే గోపీచంద్ మ‌న‌సులో మాత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఓ సినిమా చేయాల‌ని ఉంది. ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు గోపీచంద్‌. మైత్రీ ఇప్ప‌టికే ప‌వ‌న్ తో ఓ సినిమా క‌మిట్ అయి ఉంది. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్పుడు మ‌రోసారి ప‌వ‌న్‌తో అంటే కష్టం. పైగా ప‌వ‌న్ కూడా వ‌రుస క‌మిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నాడు. సెకండ్ ఆప్ష‌న్‌గా.. ఓ యువ హీరోతో థ్రిల్ల‌ర్ సినిమా చేయాల‌నుకొంటున్నాడ‌ట గోపీచంద్. మ‌రి ఆ హీరో ఎవ‌ర‌న్న‌ది ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS