గోపీచంద్‌ పొలిటికల్‌ 'పంతం'

మరిన్ని వార్తలు

ఆరడుగుల హ్యాండ్‌సమ్‌ గోపీచంద్‌ కొత్త సినిమా 'పంతం' టీజర్‌ని తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్‌. 

'ఫ్రీగా ఇళ్లిస్తాం, కరెంటిస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకి ఐదు వేలు ఇస్తాం..అంటే మంచి చెడూ, ముందూ వెనకా ఆలోచించకుండా ఓటేసేసి, కరెప్షన్‌ లేని సమాజం కావాలంటే ఎక్కడొస్తుంది..?' అంటూ గోపీచంద్‌ కోర్టు బోనులో నిలబడి జడ్జి ముందు ఆవేశంగా చెబుతున్న డైలాగ్‌ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. గోపీచంద్‌ చెప్పిన డైలాగును బట్టి ఈ సినిమా పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

 

అలాగే కామెడీ యాంగిల్‌ కూడా ఉంది. యాక్షన్‌ సీన్స్‌ ఇరగదీసేశాడు గోపీచంద్‌ టీజర్‌లో. గోపీసుందర్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కొత్తగా ఉండడంతో పాటు, ఆకట్టుకునేలా ఉంది. ఇకపోతే గోపీచంద్‌ గెటప్‌ కూడా కొత్తగా ఉందీ సినిమాలో. లైట్‌గా గెడ్డంతో కనిపిస్తున్నాడు. చక్రి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అందాల భామ మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఇటీవలే 'ఆక్సిజన్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన గోపీచంద్‌ ఆ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు 'పంతం' సినిమాతో త్వరలోనే రానున్నాడు. ఈ సినిమాపై ఇంతవరకూ పెద్దగా అంచనాలు లేవు కానీ, టీజర్‌ వచ్చాక అంచనాలు పెరిగాయి. ఎలక్షన్స్‌ దగ్గర పడుతున్నాయి. ఈ తరుణంలో పొలిటికల్‌ హీట్‌లో 'పంతం' రిలీజ్‌ టైం పర్‌ఫెక్ట్‌ టైం అనే చెప్పాలి. 

అయితే గోపీచంద్‌ టీజర్‌లో చెప్పింది నిజమే. కానీ.. పొలిటికల్‌గా ఇంత పవర్‌ఫుల్‌ సినిమా గట్టెక్కడం అంత ఈజీనా? ఏమో చూడాలి మరి గోపీచంద్‌ 'పంతం' ఎలా నెగ్గించుకుంటాడో.!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS