'సైరా'ని ప్రకృతి ఆశీర్వదించింది!

మరిన్ని వార్తలు

వాతావరణం అనుకూలించలేదన్న కారణంతో 18న జరగాల్సిన 'సైరా నరసింహారెడ్డి' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ 22కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయినా అప్పటికీ వాతావరణం అనుకూలించలేదు. కానీ, అభిమానులు ఆగుతారా.? అస్సలు ఆగరు. వర్షాన్ని, వరదల్ని సైతం లెక్క చేయరు. వాళ్లే అభిమానులంటే. అందులోనూ వారు మెగా అభిమానులు. కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని ఎంత మాత్రం లెక్క చేయకుండా, కోట్ల కొద్దీ అభిమానులు ఈ వేడుకకు హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా, వర్షం గురించి మాట్లాడుతూ మాటల రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు ఇది వర్షం కాదు, సైరాకి ఆకాశం పై నుండి అందిస్తున్న ఆశీర్వాదాలు.. అంటూ అభివర్ణించారు. నిజమే అవి ఆశీర్వాదాలే అన్నట్లు కనిపించాయి. హైద్రాబాద్‌ ఎల్బీ స్డేడియంలో జరిగిన ఈ ఈవెంట్‌కి మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలందరూ హాజరయ్యారు, ఒక్క అల్లు అర్జున్‌ తప్ప వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌లతో మెగాస్టార్‌ని చూసిన అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. నిజమైన కన్నుల పండగ అంటే ఇదే అన్నట్లు ఫీలయ్యారు. తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌, కొడుకు రామ్‌చరణ్‌తో కలిసి మెగాస్టార్‌ చిరంజీవి పోటోలకు పోజిచ్చారు. అంతకన్నా కావాల్సిందేముంటుంది అభిమానులకు. అయితే మెగా బ్రదర్‌ నాగబాబు ఈ ఈవెంట్‌కి హాజరు కాలేకపోయారు ఎందుకో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS