హరీష్‌ శంకర్‌ రూటే సెపరేటు!

మరిన్ని వార్తలు

ఏదన్నా విషయంపై స్పందించాల్సి వచ్చినప్పుడు మాటల్ని తూటాల్లా వాడుతుంటాడు దర్శకుడు హరీష్‌ శంకర్‌. ఇటీవలే 'గద్దలకొండ గణేష్‌' సినిమాతో హిట్టు కొట్టిన హరీష్‌ శంకర్‌, తాజాగా సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్టింగ్‌ ట్రెండింగ్‌గా మారుతోంది. ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇటీవల తెలంగాణలో జరిగిన 'దిశ' ఘటనకు సంబంధించిన నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై హరీష్‌ శంకర్‌ సోషల్‌ మీడియాలో స్పందించాడు. 'మా ట్రైలర్స్‌ టీజర్స్‌ లైక్‌ చేయకపోయినా ఫర్వాలేదు. ప్లీజ్‌ ఈ ఎన్‌కౌంటర్‌ న్యూస్‌ మాత్రం ట్రెండింగ్‌ చేయండి.. ఇలా జరిగింది అని చాటింపు వేయండి ప్లీజ్‌..' అంటూ ఓ ట్వీటేసిన హరీష్‌, పోలీస్‌ ఉన్నతాధికారి సజ్జనార్‌ ఫొటోని తన ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకోవడం గమనార్హం.

హరీష్‌ మాత్రమే కాదు, పలువురు సినీ ప్రముఖులు దిశ ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌ని స్వాగతిస్తున్నారు. హీరో మనోజ్‌ అయితే, ఆ ఎన్‌కౌంటర్‌లో ఉపయోగించిన బుల్లెట్‌ని దాచుకోవాలన్పిస్తోందంటూ ట్వీటేశాడు. సమంత, జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఇలా ఒకరేమిటి, మొత్తంగా సినీ పరిశ్రమ ఈ ఎన్‌కౌంటర్‌ ద్వారా దిశకు న్యాయం జరిగిందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా మహిళా లోకం, 'మృగాళ్ళకు' తగిన శిక్ష పడింది.. అంటూ నినదిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS