ఇళయరాజాకి ప్రతిష్టాత్మక ‘పద్మ’ అవార్డు

మరిన్ని వార్తలు

ఈ సంవత్సరంకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులని ప్రకటించింది. అందులో భాగంగా మేస్ట్రో ఇళయరాజాకి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించి గౌరవించింది.

దీనితో ఈయన అద్బుతమైన సంగీత ప్రయాణంలో ఈ అవార్డు ఒక కలికితు రాయిగా మారనుంది. ఈయనకి ఇంతటి ప్రతిష్టాత్మక పురస్కారం లభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

ఇక ఈ పురస్కారం అందుకున్న వెంటనే ఆయనకీ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ సూపర్ స్టార్స్ రజినీకాంత్, కమల్ హసన్ లు ఈ వార్త తెలియగానే వెంటనే ఆయనకీ ఫోన్ చేసి అభినందించారు అని సమాచారం. 

మొత్తానికి ఇళయరాజాకి అత్యున్నతమైన ‘పద్మా’ అవార్డు రావడం సంగీత ప్రియులకి గర్వకారణం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS