దేవదాసుతో సూపర్ హిట్ కొట్టి, పోకిరి తో తెలుగు చిత్రసీమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఇలియానా ఈమధ్యకాలంలో తెలుగు చిత్రసీమకి దూరమయింది. దాదాపుగా తెలుగు సినిమాలకి ఇక శాశ్వతంగా దూరమైనట్టే అని అనుకున్నారు అంతా..
ఇక ఇప్పుడు అందరి అంచనాలని తలకిందులు చేస్తూ చాలా కాలం తరువాత ఒక తెలుగు సినిమాకి పచ్చ జెండా ఊపేసింది ఈ గోవా సుందరి. ఆ వివరాల్లోకి వెళితే, రవితేజ-శ్రీను వైట్ల కలయికలో వస్తున్న అమర్-అక్బర్-ఆంటోనీ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేస్తున్నదట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గోననుందట.
అయితే హిందీలో వరుస పరాజయాలు ఎదురవతున్న సమయంలో తెలివిగా ఆమె తెలుగు సినిమాలకి చేయటానికి మొగ్గు చూపింది అన్న అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఆరేళ్ళ తరువాత ఇలియానా తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది.