పాపం పూరి జగన్నాథ్ సినిమాల్లోనే సంపాదించాడు. సినిమాల్లోనే పోగొట్టాడు. ఎంతపోయినా సరే, సినిమాలు తీయడం మానలేదు. అందుకోసం ఆస్తుల్ని కూడా అమ్ముకున్నాడు. తనయుడు ఆకాష్ పూరితో `మెహబూబా` తీసి ఇల్లు అమ్ముకోవాల్సివచ్చింది. ఇప్పుడు రామ్ సినిమా కోసం కూడా అప్పులు చేశాడు. `ఇస్మార్ట్ శంకర్` ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమాతో పూరికి లాభాలు చూడబోతున్నాడు.
ఇస్మార్ట్ శంకర్ శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ రూపంలో దాదాపు 14 కోట్లొచ్చాయి. పూరి - రామ్ సినిమాలకు ఇది పెద్ద మొత్తమే. థియేటరికల్ రైట్స్ రూపంలో మరో 20 కోట్లు ఈజీగా రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాని రూ.20 కోట్లతో పూర్తి చేసినట్టు సమాచారం. అంటే.. ఆ డబ్బులు థియేటరికల్ రైట్స్ రూపంలో వచ్చేసినట్టే. శాటిలైట్, డిజిటల్ రూపంలో వచ్చిన 14 కోట్లు లాభమన్నమాట. లాభం అనే మాట విని పూరికి ఎంత కాలమైందో..? మొత్తానికి బిజినెస్ విషయంలో ఇంతకాలానికి ఇస్మార్ట్గా ఆలోచించాడన్నమాట.