గాయని గీతా మాధురికి పండంటి అడబిడ్డ జన్మించింది. ఈ నెల 9న గీతా మాధురి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన విషయాన్ని కాస్త ఆలస్యంగా అభిమానులతో పంచుకున్నాడు ఆమె భర్త నందు. తాజాగా హీరో నందు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఈ విషయాన్ని షేర్ చేశారు. గాయనిగా మంచి పేరున్న గీతా మాధురి, డబ్బింగ్ ఆర్టిస్ట్గానూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
గత సీజన్ బిగ్బాస్ కంటెస్టెంట్గా టాప్ 3 లో నిలిచింది. బిగ్హౌస్ నుండి బయటికొచ్చిన తర్వాత గీతా మాధురి కెరీర్ పరంగా పెద్దగా యాక్టివ్గా కనిపించలేదు. కానీ, పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆ క్రమంలోనే నందూ, గీతా మాధురి తల్లితండ్రులయ్యారు. ఇటీవల ప్రెగ్నెన్సీతో భార్యా భర్తలిరువురూ సరదాగా దిగిన ఫోటో సెషన్ని గీతా మాధురి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
2014లో హీరో నందూతో గీతా మాధురి వివాహం జరిగింది. ఆ తర్వాత ఇటు పర్సనల్ లైఫ్నీ, అటు కెరీర్ని ఈక్వెల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. ఇక, నందూ విషయానికి వస్తే, అప్పుడప్పుడూ సోలో హీరోగా సినిమాలు చేస్తూనే, అక్కడక్కడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ కనిపించి మెప్పిస్తుంటాడు. నందూ నటించిన 'సవారి' సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇటీవల స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.