ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకి నో ఇన్విటేషన్?

మరిన్ని వార్తలు

నందమూరి నట సింహం బాలకృష్ణ 50 ఏళ్ళ సినీప్రస్థానం పురస్కరించుకుని గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తోంది టాలీవుడ్. ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టాలీవుడ్ ప్రముఖులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా ఇండస్ట్రీలకి చెందిన నటీ నటులు కూడా ఈ వేడుకకి వస్తున్నారు. ఇప్పటీకే పలువురికి ఇన్విటేషన్స్ అందాయి. టాలీవుడ్ సూపర్  స్టార్స్  ఒకే వేదికపై సందడి చేయనున్నారు. టైర్ 3 హీరోలు విశ్వక్ సేన్, కార్తికేయ, నిఖిల్, సిద్దు జొన్నలగడ్డ లాంటివారు బాలయ్య కోసం చిందేయటానికి రిహార్సల్స్ చేస్తున్నారని టాక్. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా బాలయ్య కోసం చీఫ్ గెస్ట్ లుగా వేంచేస్తున్నారు. 


ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌ నోవాటెల్‌లో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ జరగనున్నాయి. సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వేడుకలో ఒక లోటు కనిపిస్తోంది. అదేంటి అంటే అదే కుటుంబానికి చెందిన ఎన్టీఆర్, సోదరుడు కళ్యాణ్ రామ్ కి ఇన్విటేషన్స్ అందలేదని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో చర్చనీయంశంగా మారింది. ఇండస్ట్రీ చేస్తున్న పండగ అయినా, పర్సనల్ గా నందమూరి ఫ్యామిలీ వేడుక ఇది. కుటుంబంలో ఎన్ని వివాదాలు ఉన్నా, ఇలాంటి అరుదైన ఫంక్షన్ కి వీరిని పిలవకపోవడం కరక్ట్ కాదని విమర్శలు ఎదురవుతున్నాయి. 
  

ఇండస్ట్రీ తరపున, ఫ్యామిలీ తరపున కీలక మైన వారికి అసలు ఇన్విటేషనే అందకపోవటం విమర్శలకి తావిస్తోంది. అన్నదమ్మలిద్దరూ ఈ విషయాన్ని ఎలా ఫేస్ చేస్తారో చూడాలి. చిరంజీవి, వెంకటేష్, బాలయ్య, మహేష్ లాంటి స్టార్లు అంతా ఒక చోట సందడి చేస్తున్నవేళ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లేకపోవటం లోటు అనే అంటున్నారు సినీప్రియులు. అల్లు అర్జున్ కి కూడా స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చిన చిత్ర సీమ పెద్దలు ఈ అన్నదమ్ముల విషయంలో  నిర్ణయం మార్చుకుంటారేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS