మెగా మేనల్లుడితో 'మైత్రి': ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తుందా.?

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ తాజా చిత్రం 'చిత్రలహరి' ఈ సమ్మర్‌కి అంటే వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ప్రచార చిత్రాలతో సినిమాపై బాగానే హైప్‌ క్రియేట్‌ చేశారు. కానీ ఏమో ప్రస్తుతం తేజు మార్కెట్‌ చాలా వీక్‌గా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌కి 'అంతకుమించి' అనే స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నారట. 'రంగస్థలం' సినిమాతో తిరుగులేని బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ఆ తర్వాత చాలా సినిమాలే వచ్చాయి. కానీ ఆ స్థాయి హిట్‌ అందుకోలేకపోయాయి.

సో ఈ మెగా హీరోతో ఆ మ్యాజిక్‌ని రిపీట్‌ చేసే యోచనలో ఉందట. అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు ఆల్రెడీ స్టార్ట్‌ అయిపోయాయని తెలుస్తోంది. ఆ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారట. ఆ ఫంక్షన్‌కి జూనియర్‌ ఎన్టీఆర్‌ని ఛీఫ్‌ గెస్ట్‌గా ఇన్‌వైట్‌ చేయాలని మైత్రీ మూవీస్‌ వారు భావిస్తున్నారట. ఆ దిశగా ఎన్టీఆర్‌తో మంతనాలు చేస్తున్నారనీ తెలుస్తోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటిస్తున్నాడు. చరణ్‌, ఎన్టీఆర్‌ మెగా మల్టీ స్టారర్‌ ఇది. ఈ సినిమాని ఒప్పుకోవడంతోనే వీరిద్దరి మధ్యా స్నేహ సంబంధాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్ధం చేసుకోవాలి. ఇటీవల ఎన్టీఆర్‌, తనకు చరణ్‌ పట్ల ఉన్న అభిమానాన్ని మీడియా ముఖంగా బయటపెట్టిన సంగతి కూడా తెలిసిందే. సో మెగా ఫ్యామిలీ హీరో సినిమా ప్రమోషన్‌కి తనను ఇన్‌వైట్‌ చేస్తే రాకుండా ఉంటాడా.?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS