వంద కోట్ల క్లబ్‌లోకి 'జై లవకుశ'

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్‌ 'జై లవకుశ' సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరింది. టాక్‌తో సంబంధం లేకుండా విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా 75 కోట్లు వసూళ్లు సాధించింది. వారం రోజుల్లో 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఇది గ్రాస్‌ లెక్క. ఈ చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలుపుతూ, ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు అభిమానులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యంత ప్రత్యేకమైనది. అలనాటి ఎన్టీఆర్‌, మెగాస్టార్‌ చిరంజీవి తర్వాత త్రిపాత్రాభినయం చేసిన హీరో ఎన్టీఆర్‌. తాను చేసిన ఈ కొత్త ప్రయత్నానికి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. వారం తిరిగేసరికి 100 కోట్ల క్లబ్‌ జాబితాలో ఈ సినిమానుంచారు. ఇంతవరకూ 100 కోట్ల క్లబ్‌లో జాయిన్‌ అయిన ఎన్టీఆర్‌ సినిమాల్లో ఇది మూడవది. 'నాన్నకు ప్రేమతో', జనతా గ్యారేజ్‌' సినిమాలు ఇంతవరకూ ఈ లిస్ట్‌లో ఉన్నవి. తొలి సారిగా అన్నదమ్ముల కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన చిత్రం 'జై లవకుశ'. వంద కోట్లు గ్రాస్‌నందుకున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు అన్నదమ్ములిద్దరూ. అన్నదమ్ముల అనుబంధానికి అర్ధం పట్టేలా ఈ సినిమా తెరకెక్కింది. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాశీఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS