'బాహుబలి' తర్వాత 'జై లవకుశ'

మరిన్ని వార్తలు

డిజిటల్‌ వ్యూస్‌లో రికార్డులు సృష్టిస్తోంది 'జై లవకుశ' ట్రైలర్‌. విడుదలైన 36 గంటలలో 1 కోటి డిజిటల్‌ వ్యూస్‌ని సాధించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ వరుసలో 'బాహబలి' సినిమా ట్రైలర్‌ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండో స్థానాన్ని గెలచుకుంది 'జై లవకుశ' అట. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మూడు పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు పాత్రల్లోనూ జై పాత్రకి ఎక్కువ రెస్పాన్స్‌ వస్తోంది. రాశీఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమాలో. ముద్దుగుమ్మ నందిత ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సో ఎన్టీఆర్‌కి, కళ్యాణ్‌రామ్‌కీ ఈ సినిమా ఎంతో ప్రత్యేకం. అన్నా దమ్ముల అనుబంధానికి ప్రతీకగా తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే వాటన్నింట్లోనూ ఈ సినిమా వెరీ వెరీ స్పెషల్‌ కానుందట. ఎన్టీఆర్‌ నట విశ్వరూపం సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆ లెవల్స్‌ మరింత పెరగనున్నాయంటున్నారు సినీ ప్రముఖులు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌తో ఆడియో ఎట్రాక్ట్‌ చేస్తోంది. వరుస సక్సెస్‌ల మీదున్న ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఈ సినిమా ఓ ముఖ్య ఘట్టం కానుంది. 'ఘట్టమేదైనా, పాత్రేదైనా నేను రె..రె..రెడీ..' అంటూ ఎన్టీఆర్‌ ట్రైలర్‌లో చెప్తున్న డైలాగ్‌కి నందమూరి అభిమానులు ఊగిపోతున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా ధియేటర్లో సందడి చేస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS