కాజు పాపకి దక్కిన అరుదైన గౌరవం

మరిన్ని వార్తలు

మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో కాజల్‌ అగర్వాల్‌ మైనపు బొమ్మను ఏర్పాటు చేయనున్నారు. ఫిబ్రవరి 5న కాజల్‌ అగర్వాల్‌ మైనపు బొమ్మ ఆవిష్కరణ జరగనుంది. ఈ సంతోషకరమైన విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ కాజల్‌ ఆనందంతో ఊగిపోతోంది. చిన్నతనంలో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంకి వెళ్లినప్పుడు అక్కడి సెలబ్రిటీల విగ్రహాలు చూసి ఎంతో మురిసిపోయేదట. అలాంటిది ఇప్పుడు ఆ అరుదైన సెలబ్రిటీల మధ్య తన మైనపు బొమ్మ కూడా చోటు దక్కించుకోవడంతో ఆ ఆనందానికి అవధుల్లేవంటోంది కాజల్‌ పాప.

 

పదేళ్లకు పైగా తెలుగుతో పాటు, తమిళ, హిందీ పరిశ్రమల్లోనూ తనదైన శైలిలో హీరోయిన్‌గా ఆకట్టుకుంటోన్న కాజల్‌ అగర్వాల్‌ తను పడిన కష్టానికి దక్కిన ఫలితంగా ఈ అరుదైన అవకాశాన్ని స్వీకరిస్తున్నానని చాలా ఎగ్జైట్‌మెంట్‌తో చెబుతోంది. ఈ మ్యూజియంలో ఇంతవరకూ సౌత్‌ స్టార్స్‌ మహేష్‌, ప్రబాస్‌ల మైనపు బొమ్మల్ని ఏర్పాటు చేశారు. సౌత్‌ నుండి ఎంపికైన తొలి హీరోయిన్‌ మైనపు బొమ్మ కాజల్‌దే కావడం విశేషం. ప్రస్తుతం కాజల్‌ అగర్వాల్‌ విశ్వ నటుడు కమల్‌ హాసన్‌తో 'ఇండియన్‌ 2' చిత్రంలో నటిస్తోంది. 'కాల్‌ సెంటర్‌' అనే ఓ వెబ్‌ సిరీస్‌లోనూ కాజల్‌ నటిస్తోంది


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS