కరోనాపై పోరాటం విషయంలో హీరోలంతా ఉదారంగా స్పందించారు. భారీ విరాళాలు అందించారు. తమకు తోచిన దారిలో ఇప్పటికీ చైతన్య పరుస్తున్నారు. అయితే ఈ విషయంలో కథానాయికల స్పందన అంతంత మాత్రమే. సినిమాకి కోటి ఇచ్చుకునే నాయికలు సైతం సైడ్ అయిపోయారు. ఒకరో ఇద్దరో.. మేమున్నాం అంటూ భరోసా ఇచ్చారు. ఇతోదికంగా సాయం చేశారు.
అయితే స్టార్ హీరోయిన్లు మాత్రం ఎక్కడికక్కడ గప్ చుప్. అయితే ఇప్పుడు కాజల్ ముందడుగు వేసింది. సీసీసీ కి 2 లక్షల విరాళం ప్రకటించింది. ఈ విషయాన్ని కాజల్ మేనేజర్ గిరిధర్ ధృవీకరించారు. ఆయనే 2 లక్షల విరాళాన్నీ సీసీసీకి ట్రాన్స్ఫర్ చేశారు. సమంత, తమన్నా, శ్రుతిహాసన్, కీర్తి సురేష్ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా కాజల్ దారిలో నడిస్తే, ఎంతో కొంత విరాళాలు అందించి, సినీ కార్మికుల్ని ఆదుకుంటే - విమర్శల నుంచి తప్పించుకున్నవాళ్లవుతారు.