మొన్న నిఖిల్‌.. ఇప్పుడు కార్తికేయ!

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో నిఖిల్‌ టైటిల్‌ వివాదాన్ని ఎదుర్కొన్నాడు. 'ముద్ర' టైటిల్‌ కాస్తా ఇప్పుడు 'అర్జున్‌ సురవరం'గా మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే తరహా సమస్య మరో యంగ్‌ హీరో కార్తికేయకు ఎదురయ్యింది. కార్తికేయ హీరోగా 'గుణ 369' అనే సినిమా ఇటీవల ప్రకటితమైన సంగతి తెల్సిందే.

 

అయితే, 'గుణ' టైటిల్‌తో మరో సినిమా రాబోతోంది. తమ టైటిల్‌కి 369 అదనంగా చేర్చి తమకు అన్యాయం చేస్తున్నారంటూ 'గుణ' చిత్ర యూనిట్‌ ఆరోపిస్తోంది. 'ఖలేజా' సినిమాకి కూడా ఈ తరహా సమస్య తప్పలేదు. కళ్యాణ్‌రామ్‌ కూడా 'కత్తి' సినిమా టైటిల్‌ విషయంలో సమస్యల్ని ఎదుర్కొన్నాడు. కానీ, ఇటీవలి కాలంలో ఈ సమస్యలు మరింత తీవ్రతరమవుతున్నాయి. నిఖిల్‌ 'ముద్ర' టైటిల్‌తో ఇంకో సినిమా విడుదల చేయడమే కాదు, ఆ సినిమాని నిఖిల్‌ సినిమాగా ప్రచారం చేసుకుని, ఓ మోస్తరు ఓపెనింగ్స్‌ కూడా రాబట్టుకోవడం అప్పట్లో వివాదాస్పదమయ్యింది. మల్టీప్లెక్స్‌లలో నిఖిల్‌ పోస్టర్లతో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయగా, సోషల్‌ మీడియా ద్వారా నిఖిల్‌ ఫైట్‌ చేసేందుకు ప్రయత్నించాడు.

 

చివరికి టైటిల్‌ మార్చుకోవాల్సి వచ్చింది నిఖిల్‌. అలా చూస్తే కార్తికేయ కూడా తన సినిమా టైటిల్‌ మార్చుకోక తప్పేలా లేదు. అయితే 'గుణ 369' - 'గుణ' నిర్మాతల మధ్య ఓ అవగాహన వస్తే, ఈ సమస్యకు సానుకూల పరిష్కారం దక్కొచ్చని సినీ పరిశ్రమలో కొందరు అభిప్రాయపడుతున్నారు.
    


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS