'మల్లీశ్వరి'కి ప్రేక్షక లోకం ఫిదా.!

మరిన్ని వార్తలు

విక్టరీ వెంకటేష్‌ హీరోగా తెరకెక్కిన 'మల్లీశ్వరి' చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైన అందాల భామ కత్రినా కైఫ్‌. యాక్టింగ్‌, డాన్సుల్లో కొంత నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా, చూపు తిప్పుకోలేని తన అందంతో, తొలి చూపులోనే కుర్రకారు గుండెల్లో పదిలమైన స్థానం ఏర్పర్చేసుకుంది. అయితే తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకోలేకపోయింది. కానీ బాలీవుడ్‌లో ఈ భామకు తిరుగే లేకుండా పోయింది. ఆ కాన్ఫిడెన్స్‌ ఆమె నరనరాల్లో దాగున్న అంతులేని టాలెంట్‌ని బయటికి తీసేలా చేసింది.

కత్రినాలో ఇంత టాలెంట్‌ ఎక్కడ దాగుంది అని ఆశ్చర్యపోయేంతగా చేసింది. ప్రస్తుతం కత్రినా కైఫ్‌ 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. 'పైరేట్స్‌ ఆఫ్‌ కరేబియన్స్‌' అనే హాలీవుడ్‌ చిత్రాన్ని తలపించేలా ఉన్న ఈ చిత్రం నుండి విడుదలైన 'సురయ్యా..' అనే సాంగ్‌ ప్రోమోలో కత్రినా స్టెప్పులకు వస్తున్న రెస్పాన్స్‌ అంతా ఇంతా కాదు. 13 గంటల్లోనే 20లక్షల మందికి పైగా ఈ ప్రోమోని వీక్షించారు. కత్రినాపై ప్రశంసల జల్లు కురిపించేస్తున్నారు.

ఈ సినిమాలో లీడ్‌ రోల్స్‌ పోషించిన అమీర్‌ఖాన్‌, బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌లు కత్రినా డాన్సులకు ఫిదా అయిపోతున్నారు. ప్రభుదేవా డాన్సుల్ని అంత అవలీలగా చేసేసిన కత్రినా కైఫ్‌ గట్స్‌కి అందరూ హ్యాట్సాఫ్‌ అంటున్నారు. అలాగే ఈ సాంగ్‌లో నర్తించడానికి తాను కూడా చాలా చాలా కష్టపడ్డాననీ, దగ్గరుండి తనతో ఈ క్లిష్టమైన స్టెప్పులు వేయించడానికి సహకరించిన ప్రభుదేవాకి కృతజ్ఞతలు తెలుపుతోంది అందాల కత్రినా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS