త్వరలో బుల్లితెరపై ప్రసారం కానున్న బిగ్బాస్ సీజన్ 3 విషయంలో చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గందరగోళమే కాదు, ఈ షోని నిలిపివేయాలంటూ లీగల్గా కేసులు నమోదయ్యాయి. ఆ కారణంగా ఈ నెల 21న ప్రసారం కావాల్సిన 'బిగ్బాస్ 3' ప్రసారాలు వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వాయిదా ప్రచారంపై బిగ్బాస్ టీమ్ ఇంతవరకూ అఫీషియల్గా స్పందించలేదు. కానీ, తాజాగా గత సీజన్ విజేత కౌషల్ మండా ఈ వివాదంపై స్పందించారు.
బిగ్బాస్లో కంటెస్టెంట్స్ ఎంపిక, కార్యక్రమ నిర్వహణ అంతా చాలా నిజాయితీగా జరుగుతాయనీ, ఓ సామాన్యుడిగా, ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న తనకు ఈ ప్రోగ్రాం అంటే ఎంతో గౌరవం ఉందనీ ఆయన సోషల్ మీడియా వేదికగా స్పదించారు. అంతేకాదు, ఈ సీజన్లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ, ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, 'మీరు రైడ్ ఎక్కబోతున్నారు..' అంటూ కంటెస్టెంట్స్కి కొంచెం ముందు జాగ్రత్త చెప్పినట్లుగా ఆయన ట్వీట్ చేశారు.
కౌషల్ ట్వీట్తో నిజంగానే బిగ్బాస్ రియాల్టీ షోలో రియాల్టీ ఉందని నమ్మాలో.? లేక ప్రచారంలో ఉన్నట్లు రియాల్టీ షో పేరుతో ఈ షోకి తెర వెనక జరుగుతున్న రాజకీయాలు నిజమనుకోవాలో.? కంటెస్ట్ చేసే పార్టిసిపెంట్సే నిర్ణయించుకోవాలి.