సర్కారు వారి పాట పాడేది మహానటి?

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొత్త సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'సర్కారు వారి పాట' టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గురించి పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కియారా అద్వాని పేరును పరిశీలిస్తున్నారని, సాయి మంజ్రేకర్ ను ఫైనలైజ్ చేశారని, సారా అలీ ఖాన్ పేరు కూడా పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ ను ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బాలీవుడ్ హీరోయిన్లను తీసుకుంటే రిస్క్ ఎక్కువనే ఆలోచనలో పరశురామ్ సౌత్ హీరోయిన్లను ఎంచుకోవాలని అనుకున్నారట. కీర్తి సురేష్ అయితే కథకు చక్కగా సూట్ అవుతుందని హీరో, నిర్మాతలకు చెప్పడంతో వారు కూడా ఓకే అన్నారట. దీంతో కీర్తిని సంప్రదించడంతో వెంటనే ఓకే చెప్పిందట.

 

'మహానటి' తర్వాత కీర్తి సురేష్ కు ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ భారీగా పెరిగింది. అప్పటి నుంచి కీర్తి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. మహేష్ బాబు - కీర్తి సురేష్ జోడీ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. త్వరలోనే హీరోయిన్ విషయం అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులను ఫైనలైజ్ చేసే పనిలో పరశురామ్ టీమ్ బిజీగా ఉందట. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS