మరో బయోపిక్ లో మహానటి

మరిన్ని వార్తలు

ప్రస్తుతం అన్ని భాషల్లోనూ బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఎక్కువగా బాలీవుడ్ లో బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. టాలీవుడ్ లో మహానటి సావిత్రి బయోపిక్ ని నాగ్ అశ్విన్ తెరకెక్కించి మరి కొందరికి ఆదర్శంగా నిలిచారు. మహానటి సినిమాలో నటించిన కీర్తి సురేష్ కు ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వచ్చింది. పలు అవార్డ్స్ కూడా వరించాయి. ఈ సినిమా తరవాత సౌత్ లో బయోపిక్ ల జోరు మొదలయ్యింది. తమిళ యాక్టర్ జయలలిత బయోపిక్ కూడా తెరకెక్కించారు. కానీ అనుకున్నంత పాపులర్ అవలేదు. ఇప్పుడు కూడా ఇండియాలో వివిధ రంగాలలో గుర్తింపు పొందిన వారి బయోపిక్స్ ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 


ఇలాంటి బయోపిక్స్ లో ఎం.ఎస్ సుబ్బలక్ష్మి ఫిలిం ఒకటి. గొప్ప వ్యక్తుల జీవితాలను నేటి తరానికి అందించి, వారిని చిరస్థాయిగా ప్రజల్లో నిలిపేందుకు సినిమా ఒక అద్భుత మాధ్యమం. ఇదే మనం వారికి ఇస్తున్న ఘన నివాళి. సంగీతానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఎం.ఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథ సినిమాగా తెరకెక్కించనున్నారని సమాచారం. అయితే ఎవరు ఈ సినిమా బాధ్యతలు తీసుకున్నారు ఏంటి అనేది ఇంకా తెలియలేదు కానీ, గ్రేట్ లెజండరీ ఎం.ఎస్ సుబ్బలక్ష్మి పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుందో  అనే చర్చలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. 


ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో మొదటగా వినిపించిన పేరు కీర్తి సురేష్. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన కీర్తి అయితే బాగుంటుందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహానటిలో మొదట కీర్తి నటిస్తుంది అనగానే అందరిలో సందేహాలు మొదలయ్యాయి. నాగ అశ్విన్  సెలక్షన్ పట్ల అంతా పెదవి విరిచారు. కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగానే కీర్తి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యిందని ఒప్పుకున్నారు. మహానటి సినిమాలో ఎక్కడా కీర్తి కనిపించలేదు, సావిత్రినే చూసారు ప్రేక్షకులు. ఆ పాత్రలో అంత మమేకమైపోయింది కీర్తి. ఇప్పుడు ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో కూడా కీర్తి సురేష్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఓటు వేస్తున్నారు సినీప్రియులు. కీర్తితో పాటు నయనతార, త్రిష పేర్లు కూడా వినిపిస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS